Sai Dharam Tej: సముద్రఖని దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం జులై 31వ తేదీ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..నాకు బ్రో సినిమాలో నటించే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ మామయ్యకు త్రివిక్రమ్ గారికి సముద్రఖని గారికి కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నేను జి స్టూడియోస్ బ్యానర్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశానని తెలిపారు.
రోడ్డు ప్రమాదానికి ముందే ఈ సినిమాకు కమిట్ అయ్యాము అయితే ప్రమాదం తర్వాత తాను నటించగలనా అన్న సందేహం కూడా వచ్చింది అయితే ఈ సినిమా నుంచి నన్ను తొలగించాలని చెప్పాను. కానీ త్రివిక్రమ్ గారు నన్ను నమ్మి సముద్ర కని గారికి కొన్ని రోజులు ఎదురు చూడమని చెప్పారు.ఇక ఈ సినిమాలో మామయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని తెలియజేశారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు వారిద్దరూ ఎంత గొప్పవారో అందరికీ తెలిసిందే.ఇలా బ్రో సినిమాని ఎంతో మంచి సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సందర్భంగా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటూ సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…