Sai Dharam Tej: సముద్రఖని దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం జులై 31వ తేదీ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..నాకు బ్రో సినిమాలో నటించే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ మామయ్యకు త్రివిక్రమ్ గారికి సముద్రఖని గారికి కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నేను జి స్టూడియోస్ బ్యానర్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశానని తెలిపారు.
రోడ్డు ప్రమాదానికి ముందే ఈ సినిమాకు కమిట్ అయ్యాము అయితే ప్రమాదం తర్వాత తాను నటించగలనా అన్న సందేహం కూడా వచ్చింది అయితే ఈ సినిమా నుంచి నన్ను తొలగించాలని చెప్పాను. కానీ త్రివిక్రమ్ గారు నన్ను నమ్మి సముద్ర కని గారికి కొన్ని రోజులు ఎదురు చూడమని చెప్పారు.ఇక ఈ సినిమాలో మామయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని తెలియజేశారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు వారిద్దరూ ఎంత గొప్పవారో అందరికీ తెలిసిందే.ఇలా బ్రో సినిమాని ఎంతో మంచి సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సందర్భంగా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటూ సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…