Yamudiki Mogudu : 1988 సంవత్సరం రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం యముడికి మొగుడు. మెగాస్టార్ చిరంజీవి, రాధా, విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమాలో యముడిగా కైకల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య, విలన్స్ గా రావు గోపాల రావు గొల్లపూడి మారుతి రావు కమెడియన్ సుధాకర్ నటించారు. ఇక ఈసినిమా అప్పటి వరకు చిరంజీవి నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. సుధాకర్ ను తెలుగు సినిమాకు కమెడియన్ గా అందించింది.
నలుగురు స్నేహితులు కలిసి తీసిన చిత్రం…..
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తొలి రోజుల్లోనే చిరంజీవి, నారాయణ, హరిప్రసాద్, సుధాకర్ మంచి మిత్రులు. నలుగురు ఒకే రూమ్ లో ఉండి సినిమాల కోసం ప్రయత్నించే వారు. ఇక అవకాశాలు వచ్చాక ఎవరికి వారు బిజీ అయ్యారు. ఇక చిరంజీవి తెలుగు సినిమాల్లో హీరోగా హిట్లనందుకుంటూ ఎదుగుతున్నారు. సుధాకర్ తమిళ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్నారు. హరిప్రసాద్, నారాయణ కూడా సినిమాల్లో బిజీ అయ్యారు. ఇక అప్పటికే దేవాంతకుడు సినిమాను చిరుతో తీసిన నారాయణ మరో సినిమా తీయాలని భావించారు, కానీ చిరంజీవి నువ్వు, సుధాకర్, హరిప్రసాద్ కలిసి తీయండి చేస్తాను అని అన్నారట. ఈసినిమా ఆర్థికంగా నిలబెడుతుందని ఆయన నమ్మకం.
ఇక నలుగురు కలిసి సినిమా చేద్దామని అనుకున్నాక నారాయణ, హరిప్రసాద్ చాలా కథలను విన్నా ఏవి నచ్చలేదు, ఇక సత్యానంద్ చెప్పిన ఒక లైన్ చాలా నచ్చింది. ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఉంటారు ఆ పాయింటును యముడికి లింక్ చేసి సినిమా తీద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఇక సినిమా కోసం డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్ ను స్థాపించారు. ఆ పేరును కూడా చిరంజీవి నే సూచించారు.
ఇక సినిమాలో అప్పటివరకు విలన్ గా చేస్తున్న సుధాకర్ ను కమెడియన్ గా చూపించారు. చిన్న సినిమాలకు సంగీతాన్ని అందించే రాజ్ కోటి లను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. డైరెక్టర్ గా రవి రాజా పినిశెట్టి ని అల్లు అరవింద్ సిఫార్సు చేసారు. కోటి పాతిక లక్షల రూపాయల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈసినిమా ఘన విజయం అందుకుంది. సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్. కాళీ అనే రఫ్ పాత్రలోనూ, బాలు అనే సాఫ్ట్ పాత్రలోనూ రెండు వేరియేషన్స్ లోనూ నటించి చిరు మెప్పించాడు. ఇక హీరోయిన్స్ రాధా, విజయశాంతి పోటాపోటీగా నటించారు. సినిమా చాలా థియేటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుని మంచి విజయాన్ని నమోదు చేసింది.
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…