Yandamuri Verendhranath : తెలుగులో నవలా రచయితగా ఎన్నో ఫేమస్ నవలలను రాసిన వ్యక్తి యండమూరి గారు. వెన్నెల్లో ఆడపిల్ల, రాక్షసుడు, మరణ మృదంగం, తులసీ దళం వంటి ఎన్నో నవలను రాసిన ఆయన అప్పట్లో పాఠకులను ఆయన కలంతో ప్రభావితం చేశారు. ఆయన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చి హిట్ అందుకున్నాయి. ఇక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎన్నో ఉపన్యాసాలను ఆయన పలు విద్యాసంస్థల్లో ఇస్తూ ఎంతో మందిని ప్రభావతం చేశారు. ఇక సినిమాల్లో కథను అందించేవరకే నా పాత్ర ఇక సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పే యండమూరి గారు పలు అంశాల మీద తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అదంతా మాఫియా లాంటిది… ఆ సినిమాలను చూడలేదు…
యండమూరి గారి నవలలు ఎన్నో సినిమాలుగాను వచ్చాయి. ఆయన నవలలు తెలుగులోనే కాకుండా తమిళంలోనూ బాగా ప్రాచుర్యం పొందాయి. తమిళంలో యద్దనపూడి సులోచన రాణి నవలలను కూడా యండమూరి పేరుతో అనువదించడం జరిగింది. దీని గురించి మాట్లాడుతూ యండమూరి గారు అందులో తన తప్పు లేదని క్లారిటీ ఇచ్చారు. తమిళంలో ఒక లేడీ రచయిత మూగ, చెవిటి ఆమె తన వద్దకు వచ్చి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఏదైనా హెల్ప్ చేయమని అడిగే సరికి రాయల్టీ లేకుండా తన నవలలను అనువదించి అమ్ముకోమని చెప్పాడట.
అలా ఆమె ఒక ఐదు లక్షల వరకు సంపాదించుకుని కూతుర్లకు పెళ్లిళ్లు వంటివి చేసిందట. అయితే ఆ తరువాత మిగిలిన రచయితల తెలుగు నవలలను కూడా అనువదించి వీరేంద్రనాథ్ పేరు మీద పబ్లిష్ చేసి వదలడం చేయడం వల్ల సమస్య వచ్చిందని, నేను యద్దనపూడి గారి జీవన తరంగాలు నవల నా పేరు మీద అనువదించి అచ్చేసినపుడే ఆమెకు వివరించి అదంతా మోసం అని చెప్పానని వివరించారు. ఇక తాను సినిమాలను చూడక చాలా కాలం అయిందని దాదాపు 40 ఏళ్లయిందంటూ చెప్పారు. మగధీర, బాహుబలి వంటి సినిమాలను కూడా నేనేం చూడలేదంటూ చెప్పారు. సినిమాలు నాకు ఆసక్తిని కలిగించవని చెప్పారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…