Yash Master : గత వారం నెల్లూరు లోని ఒక హోటల్ లో ఉరివేసుకుని ఢీ లో పనిచేస్తున్న డాన్స్ మాస్టర్ చావా చైతన్య మరణించిన విషయం తెలిసిందే. ఎవరైనా సెలబ్రిటీకి సంబంధిచిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో చర్చకు దారి తీయడం కామన్. అయితే చైతన్య మాస్టర్ మరణించిన తరువాత మరణానికి కారణం అప్పులని కొంతమంది కాదు ఎవరి వల్లో చనిపోయాడని అంటుంటే మరి కొంతమంది పేకాట వల్లే మరణించాడని మాట్లాడారు. ఇక ఈ విషయం గురించి ఢీ డాన్స్ షో ద్వారా పైకి వచ్చిన వాళ్లలో ఒక్కడైన యష్ మాస్టర్ మాట్లాడారు.
నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు…
యష్ మాస్టర్ చైతన్య మాస్టర్ గురించి మాట్లాడుతూ అలా ఆత్మహత్య చేసుకుని చనిపోయి అందరినీ షాక్ కి గురిచేసాడు. ఢీ లో బాయ్స్ కి ఏది కావాలన్నా తాను చూసుకునే వాడు. అలాంటి మాస్టర్ చనిపోతే ఆయన మరణాన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన చనిపోయిన బాధలో వారి కుటుంబం సన్నిహితులు ఉండగా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం బాగోలేదు. పేకాట వల్లే చనిపోయాడు, అలా చనిపోయి ఉండకూడదు అంటూ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు.
నిజానిజాలు తెలియకుండా చైతన్య మాస్టర్ తో పరిచయం ఉన్నా లేకున్నా ఇలా మాట్లాడటం ఏంటి, ఆయన ఎంత బాధ పడి ఉంటే చనిపోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటాడు. మైక్ ముందు పెట్టారు కదా అని అలా చేసి ఉండకూడదు ఇలా చేసి ఉండకూడదు అంటూ దయచేసి మాట్లాడకండి. మీ ఇంట్లో వాళ్లకే ఇలాంటి పరిస్థితి వస్తే అలానే మాట్లాడుతారా లేక మీకే అలాంటి పరిస్థితి వస్తే వేరొకరు ఇలా మాట్లాడితే మీకెలా ఉంటుంది అంటూ ప్రశ్నించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…