ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయ్యారు. టెక్నాలజీకి అనుకూలంగా వాళ్లు కూడా ముందుకు సాగుతున్నారు. సాంకేతికతను కూడా వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఇటువంటి నేరాలు కొన్ని వేల సంఖ్యలో జరిగాయి. అపరిచిత వ్యక్తిగా లిఫ్ట్ అడిగి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ మరో ముఠాను ముందుగానే ఉంచి.. అతడి దగ్గర ఉన్న మొత్తం సొమ్మును దోచేసి పారిపోతున్నారు.
ఈ సంఘటనలో ఒక్కోసారి ప్రాణాలను కూడా తీయడానికి వెనుకాడటం లేదు. సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో ఇలాంటివి కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇటీవల ఓ యువకుడు హనీట్రాప్ లో పడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని ఘట్ కేసర్ కు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటాడు.
ఏ అప్ డేట్ వచ్చినా వెంటనే ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటాడు. ఇలా ఓ రోజు అతడికి ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఓ యువతి పరిచయం అయింది. తర్వాత వారి వాట్సాప్ నంబర్లను మార్చుకొని ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ.. ఆమె ప్రేమలో పడినట్లు నమ్మించింది. ఓ రోజు అతడితో నగ్నంగా వీడియో కాల్ చేయించి.. సీక్రెట్ గా దానిని మొత్తం రికార్టు చేసింది. అప్పటి నుంచి ఆ యువకుడిని వీడియోను అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టడం ప్రారంభించింది.
ఆ వీడియో దాదాపు 40 సెకన్ల వరకు ఉంటుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే.. రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏం చేయాలో అర్థం గాక అతడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా తనను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారని.. తనను వారి చెర నుంచి కాపాడాలని వేడుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…