ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయ్యారు. టెక్నాలజీకి అనుకూలంగా వాళ్లు కూడా ముందుకు సాగుతున్నారు. సాంకేతికతను కూడా వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఇటువంటి నేరాలు కొన్ని వేల సంఖ్యలో జరిగాయి. అపరిచిత వ్యక్తిగా లిఫ్ట్ అడిగి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ మరో ముఠాను ముందుగానే ఉంచి.. అతడి దగ్గర ఉన్న మొత్తం సొమ్మును దోచేసి పారిపోతున్నారు.
ఈ సంఘటనలో ఒక్కోసారి ప్రాణాలను కూడా తీయడానికి వెనుకాడటం లేదు. సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో ఇలాంటివి కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇటీవల ఓ యువకుడు హనీట్రాప్ లో పడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని ఘట్ కేసర్ కు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటాడు.
ఏ అప్ డేట్ వచ్చినా వెంటనే ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటాడు. ఇలా ఓ రోజు అతడికి ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఓ యువతి పరిచయం అయింది. తర్వాత వారి వాట్సాప్ నంబర్లను మార్చుకొని ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ.. ఆమె ప్రేమలో పడినట్లు నమ్మించింది. ఓ రోజు అతడితో నగ్నంగా వీడియో కాల్ చేయించి.. సీక్రెట్ గా దానిని మొత్తం రికార్టు చేసింది. అప్పటి నుంచి ఆ యువకుడిని వీడియోను అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టడం ప్రారంభించింది.
ఆ వీడియో దాదాపు 40 సెకన్ల వరకు ఉంటుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే.. రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏం చేయాలో అర్థం గాక అతడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా తనను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారని.. తనను వారి చెర నుంచి కాపాడాలని వేడుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…