YS Jagan: వైయస్ జగన్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదానీ వ్యవహారంలో ఈయనకు ముడుపులు అందాయని జగన్ పై చర్యలు తీసుకోవాలి అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై స్పందిస్తూ ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కదా ఐదు సంవత్సరాల కాలంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు . కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిస్కంల అప్పులు పెరిగాయన్నారు. రెడ్బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ మండిపడ్డారు. మన ప్రభుత్వ హయామంలో రైతులకు ఉచితంగా పగటిపూట తొమ్మిది గంటల పాటు కరెంట్ ఫ్రీగా ఇచ్చాము కానీ ప్రస్తుతం రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదని తెలిపారు.
కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోంది. మా హయాంలో గత ఐదేళ్లలో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మంచి చేశాము ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.సూపర్ సిక్స్లు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కనిపించవు. రెడ్బుక్ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు బడ్జెట్ తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో స్కాములు జరుగుతున్నాయని తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎంతో శ్రమించానని.. కానీ తన కష్టాన్ని వృథా చేస్తున్నారని వైయస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతూ చేసిన ఈ కామెంట్స్ లో సంచలనంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…