RGV: రాంగోపాల్ వర్మ ప్రస్తుతం సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి చేసిన పోస్టులపై ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై కేసులో నమోదు కావడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు చేస్తున్నారు. వర్మపై రెండు జిల్లాలలో కేసు నమోదు కావడంతో పోలీసులు ఈయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వర్మ పై కేసు నమోదు కావడంతో ఈయన పరారీలో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్న తరుణంలో ఈయన మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వరుస పోస్టులు చేస్తున్నారు. నేను పారిపోయానని ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళలేదు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నానని తెలిపారు. ఇకపోతే నేను గత సంవత్సరం క్రితం పెట్టిన పోస్ట్ కి ఇప్పుడు ఆ తొమ్మిది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే ఇప్పుడు కేసులు పెట్టారు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే దేశానికి సగం మంది జైలులోనే ఉంటారని ఈయన కామెంట్లు చేశారు.
కేవలం మీడియా ఫోన్ కాల్స్ భరించలేక తాను ఫోన్ ఆఫ్ చేసుకున్నానని వర్మ తెలిపారు.చట్టాన్ని గౌరవిస్తా. కానీ నా హక్కులు నాకున్నాయని ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా ఈయన పలు విషయాలు తెలిపారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పటినుంచి నాకు చంద్రబాబుపై సదాభిప్రాయం పోయిందని తెలిపారు .
ఇక చంద్రబాబుపై నాకు ఏర్పడిన అభిప్రాయం ఎప్పటికీ మారదని వర్మ తెలిపాడు. అందుకే వ్యూహం సినిమాలో ఆయన పాత్ర అలా చూపించానని అన్నారు. రాజకీయ నేతలు పోలీసులను ఆయుధంగా మార్చుకుని పనిచేస్తున్నారు. ఇలా ఏడాది క్రితం నేను పెట్టిన పోస్ట్ కు ఇప్పుడు మీకు మనోభావాలు దెబ్బ తిన్నాయా అంటూ ఈయన వరుసగా పోలీసులను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…