YS Sharmila: మా నాన్నను కుట్ర చేసి చంపారు.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

YS Sharmila: వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంత చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ స్థాపించిన ఆమె వచ్చే ఎన్నికలలో పెద్ద ఎత్తున పోటీకి దిగుతున్నారు.ఈ క్రమంలోనే కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఆమె పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్తున్నారు.

ఈ విధంగా తన పార్టీని ప్రజలలోకి తీసుకెళ్తూ ఈమె ప్రచారం నిర్వహిస్తుండగా తన ప్రచారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఈమె ఆరోపించారు. ఇకపోతే తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఈమె కొందరు తనని హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

YS Sharmila: తనని చంపడానికి కుట్ర చేస్తున్నారు…

తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసే చంపారని అలాగే తనని కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ఈమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాపై ఎన్ని కుట్రలు చేసినా తను భయపడనని తను పులిబిడ్డను, తనకు భయం లేదు ఈ సంకెళ్లు నన్ను ఆపలేవు అంటూ ఈమె సంకెళ్లు చూపిస్తూ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడితే టిఆర్ఎస్ నేతలకు వణుకు ఎందుకు అని ఈమె ప్రశ్నించారు. షర్మిల తన తండ్రి మరణం గురించి తనని కుట్ర చేసే హత్య చేశారంటూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.