రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి అవి ఆమోదించి సెప్టెంబర్ 27 నాటికి సంవత్సరం అయింది. దీంతో దానికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ బంద్కు దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది.
అయితే ఈ బంద్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారత్బంద్కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి షర్మిల ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రతీ ఒక్కరు మద్దతు తెలిపి ఈ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వ విధానాలకు ఎండగట్టేందుకు త్వరలోనే పాతయాత్రను చేపట్టబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక జేఏసీ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించగా.. యాజమాన్యం మాత్రం బస్సు సర్వీసులు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…