కపిల్ దేవ్.. క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమైన పేరు. 1959లో జన్మించిన కపిల్.. ప్రస్తుతం హర్యానాలో ఉంటున్నారు. అతడు 1979 లో రోమీ భాటియాతో పరిచయం ఏర్పడి.. 1980లో వివాహం చేసకున్నాడు. ఆ దంపతులకు కూతురు అమియాదేవ్ పుట్టింది. కపిల్ దేవ్ కు మొదట ఓ ప్రేమాయాణం నడిచిందట. అదేంటో.. ఆ విషయాలను తెలుసుకుందాం.. బాలీవుడ్ బ్యూటీ సారిక అందరికీ తెలిసిందే. ఒక రోజు ఓ పార్టీలో సారికను కపిల్ దేవ్ కు పరిచయం చేసింది.. వెటరన్ స్టార్ మనోజ్ కుమార్ భార్య. అలా వారి స్నేహం మొదలై ప్రేమగా మారింది.
ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో అతడు ఓ రోజు సారికను తన ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. ఇక పెళ్లి చేసుకోవడమే.. తరువాయి అనుకున్నారు. కానీ అతడు సారికతో బంధాన్ని తెంచుకున్నాడు. ఎందుకంటే.. దీని కంటే ముందు జరిగిన ఘటన తెలుసుకోవాలి..
అదేంటంటే.. సారిక కపిల్ తో పరిచయం కాకుముందే కపిల్ కు రోమీ భాటియాకు మధ్య ప్రేమాయాణం నడిచింది. సునీల్ భాటియానే రోమీని.. కపిల్ కు పరిచయం చేశారు. ఆ రోజు నుంచి ఇద్దరు స్నేహం చేసి.. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇలా వారిద్దరి మధ్యలో కొన్ని రోజులకు మనస్పర్థలు వచ్చాయి. ఆమె మీద కోపంతోనే సారికకు దగ్గరయ్యాడని.. కపిల్ స్నేహితులు చెప్పారు. అయితే రోమీతో అప్పటికే లవ్ లో ఉన్న కపిల్ .. సారిక ను పక్కన పెట్టేశాడు.
వీళ్లిద్దరి మధ్య లవ్ నడుస్తున్నట్లు వార్తలు రావడంతో.. ఇక వదిలేస్తే తనకు దక్కకుండా పోతాడనే భావనతో మళ్లీ కపిల్, రోమీ ఒక్కటయ్యారని చెప్పారు. ఇంత జరిగిందా అంటూ.. విషయం తెలుసుకొని సారిక బాధ పడిందట. కపిల్ దేవ్ తన లవ్ ప్రపోజల్ ను ఒక ట్రైన్ లో చెబుతాడు. కిటికీలోంచి ఒక అందమైన ప్రదేశాన్ని చూపిస్తే.. ఇక్కడ నా ఫొటో తీస్తావా.. భవిష్యత్ లో మన పిల్లలకు ఈ ఫొటోలోని ప్రదేశాన్ని చూపించొచ్చు అనగానే ఆమెకు కపిల్ లవ్ చేస్తున్నట్లు అర్థం అయిపోంది. ఇక 1980లో వీళ్లు వివాహ బంధంతో దగ్గర అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…