YS Sharmila: భారతదేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ పై కీలక ఆరోపణలు వెలుగులోకి రావడం.. వాటిలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ కూడా గతంలో భారీ స్థాయిలో ముడుపులు అందుకున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై వైయస్ షర్మిల స్పందించారు.
ఈ విషయం గురించి ఈమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు. ఇక ఈ లేఖలో అదానీతో జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని తెలిపారు. ఈ ఒప్పందాల కారణంగా ప్రజలపై రూ. 1.50 లక్షల కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీ నుంచి 100 కోట్ల రూపాయలు విరాళం అందింది. అయితే ఈయన సిఎస్ఆర్ ఫండ్ కింద సిల్క్ యూనివర్సిటీ కోసమే ఈ విరాళాలను అందుకున్నట్లు తెలియజేశారు కానీ ప్రస్తుతం అదానీ గురించి ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి విరాళాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేశారు.
ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ ఈమె రాసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ కూడా షర్మిల ఈ లేఖలో పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…