YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో అత్యంత మెజారిటీతో గెలిచారు కానీ ఈ ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే స్పీకర్ కి లేఖ రాస్తూ తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే సమస్యల పట్ల ప్రశ్నించే హక్కు ఉంటుందని ఈయన లేఖ రాసినప్పటికీ స్పీకర్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాలేదు.
ఈ క్రమంలోనే ఈయన అసెంబ్లీలోకి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడపలో ఉప ఎన్నికలను నిర్వహిస్తూ కడప ఎంపీగా అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఈయన ఎంపీగా ఎన్నికలలో పోటీ చేస్తూ పార్లమెంటుకు వెళ్తున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.
ఇక ఇటీవల వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కడపలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయని తెలుస్తోంది. అలా జరిగితే షర్మిల తరపున నేను ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేస్తానని తెలిపారు. దీంతో ఈ వార్తలు మరింత చక్కర్లు కొట్టడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ చిన్నాన వై వి సుబ్బారెడ్డి స్పందించారు.
దుష్ప్రచారాలే..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తూ పార్లమెంటుకు వెళ్తారని వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా ఆవాస్తవమని ఇవన్నీ కేవలం టిడిపి వారి దుష్ప్రచారాలే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా జగన్ గురించి వస్తున్న ఈ వార్తలలో నిజం లేదని ఈయన వెల్లడించారు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…