AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనమైన విజయాన్ని సొంతం చేసుకుంది కానీ ఈసారి మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఈసారి జగన్ ఓటమి కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక 2019వ సంవత్సరంలో జగన్ భారీ మెజారిటీతో గెలవడానికి షర్మిల కూడా ప్రధాన కారణం అని చెప్పాలి.
జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పార్టీ బాధ్యతలను తీసుకొని పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లింది. అలాగే అన్నకు తోడుగా పాదయాత్రలో భాగమై ఈ పార్టీ గెలుపుకు ఎంతగానో కృషి చేసింది. ఇలా తన అన్న విజయానికి ఎంతగానో దోహదం చేసిన షర్మిల ఈసారి ఎన్నికలలో మాత్రం తన అన్నయ్య ఓటమికి ఒక కారణంగా నిలిచింది.
జగన్ షర్మిల ఇద్దరూ గొడవ పడటానికి కారణం ఆస్తులే అని వార్తలు వచ్చాయి కానీ వీరిద్దరి మధ్య అంతకుమించిన గొడవ ఏదో ఉందని తెలుస్తుంది. ఆస్తుల వల్లే గొడవలు అయితే ఈమె కోర్టుకు వెళ్లి లీగల్ గా తన ఆస్తులను తాను సొంతం చేసుకోవచ్చు కానీ వీరి మధ్య మరేదో గొడవ ఉందని అది విజయమ్మ కూడా పరిష్కరించే సమస్య కాదని తెలుస్తోంది.
ఆస్తుల పంపకాలు..
జగన్ షర్మిల రాజకీయాలకు అడ్డుకట్ట వేయడం వల్లే ఈమె తన అన్నను కాదని ఇలా మరో పార్టీలోకి వచ్చి తన అన్నను కూడా దెబ్బ తీస్తోందని తెలుస్తుంది. అయితే వీరిద్దరూ ఇలా మొండిగా ఎవరికివారు వెళ్లడం పట్ల వైయస్ అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొండి తనంతో ప్రవర్తిస్తే ఇద్దరికీ ఏపీలో రాజకీయ భవిష్యత్తు ఉండదనే వాదన కూడా వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి యధావిధిగా ఒకే తాటిపై నడిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అభిమానులు భావిస్తున్నారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…