మానవ జీవితంలో ఎవరైనా మరణిస్తే రక్త సంబంధికులే మరచిపోయే ఈ రోజుల్లో చిన్నప్పటి నుండి ఇంట్లో పెంచుకున్న కుక్క మరణించినా తన జ్ఞాపకాలు మరువలేని ఓ వ్యక్తి వర్ధంతిని ఘనంగా నిర్వహించాడు ఓ యజమాని. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురంకు చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు అనే వ్యక్తి తన ఇంట్లో చిన్నప్పటి నుండి పెంచుకున్న కుక్క అనుకోకుండా మరణించింది. అయితే పేరుకు కుక్క అయినప్పటికీ ఇంట్లో ఓ మనిషిగా అంజి అనే పేరుతో పిలుస్తూ కుక్క పై అనుబంధం పెంచుకున్నారు జ్ఞానప్రకాశరావు కుటుంబ సభ్యులు.
గత 5 ఏళ్ళ క్రితం ఇదే రోజు మరణించడంతో తట్టుకోలేకపోయిన ఆ కుటుంబం అంజి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అంజి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాడు జ్ఞానప్రకాశరావు. నేడు 5వ వర్ధంతి సందర్భంగా అంజి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి,శాస్త్రీయ బద్దంగా అంజి ఆత్మకు శాంతి కలగాలని వేద పండితులు చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంత వాసులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. రక్త సంబంధం లేకపోయినా ఎక్కువ రోజులు మాకుటుంభంతో జీవించిన అంజి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూపరులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…