రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇప్పుడంటే ఈయన్ని వివాదాల దర్శకుడు అని అంటున్నారు కానీ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అయన ఒక సంచలనం.. అయితే.. ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం అయన తీసే సినిమాలకంటే.. చేసే కంట్రవర్సీలతోనే ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ట్వీట్ చేసారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.
ఆర్గీవీ ట్వీట్ లో.. గత ఇరవై ఏళ్ళలో ఏ స్టార్ హీరోలోనూ చూడలేనంత స్క్రీన్ ప్రెజన్స్ “లైగర్” సినిమాలో విజయ్ దేవరకొండ కు ఉందని. అది బయటకి తీసినందుకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సినిమా నిర్మాతలో ఒకరైన ఛార్మికి ధన్యవాదములు అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేయడానికి కొద్దిసేపటి ముందే ‘లైగర్’ లోని కొన్ని సన్నివేశాలు చూశానని ట్వీట్ చేసారు. వెంటనే ఆర్జీవి ఈ కామెంట్స్ చేయడంతో దేవరకొండ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో లైగర్ లో ఎలా ఉండబోతున్నాడోనని మరింత ఆసక్తితో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…