Featured

చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలో ఆయనకు డూపుగా నటించిందెవరో మీకు తెలుసా..?!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం మొదలవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. 1976లో క్రాంతికుమార్ నిర్మాణ సారథ్యంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో జ్యోతి అనే సినిమా రూపొందడం జరిగింది. ఆ నిర్మాతే చిరంజీవితో ప్రాణం ఖరీదు చిత్రాన్ని రూపొందించారు. ప్రాణం ఖరీదు చిత్ర దర్శకుడు కె.వాసును ప్రాణం ఖరీదు లో యాక్ట్ చేస్తున్న కొత్త కుర్రాడు ఎలా ఉన్నాడని రాఘవేందర్ రావు అడిగారు. చిరంజీవి సాంగ్స్ పెట్టుకొని నైట్ విపరీతంగా డాన్స్ చేస్తున్నాడు.. నాకు రాత్రిళ్లు నిద్ర ఉండటం లేదని కె.వాసు రాఘవేంద్రరావుకు చెప్పారు.

ఆ తర్వాత నిర్మాత క్రాంతికుమార్ ఆఫీసుకు వచ్చిన కె.రాఘవేంద్రరావు అక్కడే ఉన్న చిరంజీవిని చూడడం జరిగింది. చిరంజీవి తీక్షణమైన కళ్ళను చూసి ఎలాగైనా తాను తీయబోయే సినిమాలో చిరంజీవికి ఒక పాత్ర ఇవ్వాలని కె. రాఘవేంద్రరావు నిర్ణయించుకోవడం జరిగింది. అలా క్రాంతి కుమారు నిర్మాతగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మోసగాడు చిత్రంలో శోభన్ బాబు, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో రాఘవేంద్రరావు చిరంజీవికి అవకాశం ఇవ్వడం జరిగింది. 1980లో లో చిరంజీవి రాఘవేంద్రరావు ప్రయాణం మొదలైంది ఆ తర్వాత ఎన్టీఆర్ చిరంజీవి కలయికలో తిరుగులేని మనిషి, ఆ తరువాత చిరంజీవిని సోలో హీరోగా పెట్టి కొండవీటి రాజా అనే సూపర్ డూపర్ హిట్ సినిమాలని రాఘవేంద్రరావు తీయడం జరిగింది.

ఆ తర్వాత అడవి దొంగ, చాణక్య శపధం, యుద్ధభూమి, మంచి దొంగ వీటితో పాటుగా తెలుగు సినీ పరిశ్రమ మర్చిపోలేని సోషియో ఫాంటసీ కథాంశంతో చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే ఇండస్ట్రీ హిట్ సినిమా రాఘవేంద్ర రావు అందించారు. ఆ తరువాత రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు, శ్రీ మంజునాథ లాంటి చిత్రాలను రాఘవేంద్రరావు చిరంజీవితో రూపొందించడం జరిగింది. 1994 అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపిస్తారు.

ఈ త్రిపాత్రాభినయం లో ఏదో ఒక పాత్రను చిరంజీవి పోషిస్తూ మిగిలిన రెండు పాత్రలను డూప్ గా పెట్టడం జరిగింది. ఇద్దరు డూపుల్లో ఒకరు తన స్నేహితుడు నటుడు ప్రసాద్ బాబు కాగా, రెండవ డూపుగా చిరంజీవి పర్సనల్ పి.ఏ సుబ్బారావు నటించారు. ఈ చిత్రంలోని త్రిపాత్రాభినయంలో పృద్వి పాత్రకు చాలా వెయిట్ ఉంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి మూడు పాత్రలకు విభిన్నమైన వాయిస్ డబ్బింగ్ చెప్పడం ఓ విశేషం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

12 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

12 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

12 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

12 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

12 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

12 hours ago