ఇదో పెద్ద క్రైమ్ థ్రిల్లర్. భర్తను దారుణంగా హత్య చేసి, అతని స్థానంలో ప్రియుణ్ణి తెచ్చుకుని, నలుగురి ముందూ భర్తగా నిలపాలని ఓ భార్య పన్నిన పన్నాగం. అచ్చుగుద్దినట్లు ‘ఎవడు’ సినిమాలో మాదిరి ప్లాస్టిక్ సర్జరీలు చేయించి మొగుడి ప్లేసులో తన కొత్త మొగుణ్ణి దింపాలనుకుంది. ఈ అభినవ సతీ సావిత్రి చేసిన పనిని చూసి యావత్ దేశం ముక్కన వేలేసుకుంటోంది. భర్తపై యాసిడ్ దాడి జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులను నమ్మించిన కిలాడీ.. న్యాయమూర్తి ముందు తలకు బ్యాండేజీ వేసివున్న ప్రియుడితో స్టేట్ మెంట్ ఇప్పించేంతటి కథ నడిపిన శాడిస్ట్.. అయితే స్వాతి కథ, స్క్రీన్ ప్లే క్లయిమాక్స్ లో బయటపడింది. ఇంకేముంది, ఆమె, ప్రియుడు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి దాపురించింది.. గత వారం నాగర్ కర్నూలులో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి వెనుకున్న అసలు నిజాలు తెలుసుకుని ఇప్పుడు పోలీసులే నివ్వెరపోయారు.
హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజును కాలాష్టమిగా పిలుస్తారు.…
భారతదేశంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లలోపు వయసున్న…
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఓట్స్ను భాగం చేసుకుంటున్నారు. బరువు తగ్గడం,…
ఈ మధ్యకాలంలో చాలా మంది అకస్మాత్తుగా వచ్చే నడుము నొప్పిని సాధారణ సమస్యగా తీసుకుంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, తప్పుగా నిద్రపోవడం…
మహారాష్ట్రలో తాజాగా నమోదైన బర్డ్ ఫ్లూ కేసులు మరోసారి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పక్షుల్లో హెచ్5ఎన్1 వైరస్…
ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు పప్పుధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో శనగలు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే…