సందర్భం దొరికితే చాలు.. ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చేయాలని, అభాసుపాలు చేయాలని చూస్తుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. ఆ సమయంలో వాళ్లు చేసే పొరపాటుతో… నవ్వుల పాలవుతుంటారు. ఉత్తరాఖండ్ లో సరిగ్గా ఇదే జరిగింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అరవింద్ పాండే… ప్రభుత్వ విద్యాసంస్థల్లో తనిఖీలు చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా రాజధాని డెహ్రాడూన్ లోని మహిళా ఇంటర్ కాలేజ్ కు వెళ్లారు. అక్కడ ఓ క్లాసులోకి వెళ్లారు. అప్పుడు అక్కడ సైన్స్ క్లాస్ జరుగుతోంది. అందరినీ నిశ్శబ్దంగా ఉండమన్న ఆయన.. మైనస్ ప్లస్ మైనస్ ఎంతవుతుందని క్లాస్ టీచర్ ని అడిగారు. అప్పుడు మైనస్ అని ఆన్సర్ ఇచ్చింది టీచర్. వెంటనే ఆగ్రహించిన ఆయన.. ప్లస్ అవుతుందన్నారు. నేను కూడా సైన్స్ చదివా అంటూ టీచర్ ను గదమాయించారు. మహిళవు కాబట్టి ఏం అనటం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న అధికారి.. మంత్రిగారిది తప్పని తెలిసినా ఏమీ అనలేని పరిస్థితి.
అరవింద్ పాండే అంశం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. నెటిజన్లు ఆయన్ను ఒక ఆట ఆడుకున్నారు. ఇంత జరిగినా… ఆయనలో మార్పు రాలేదు. టీచర్లను అవమాన పరచాలనే భావన తనకు లేదని.. ‘కీ’ పుస్తకాలు పట్టుకుని చెబుతున్నారని.. దాన్నే తప్పుపడుతున్నా అన్నారు. ఇప్పటికి కూడా మైనస్ ప్లస్ మైనస్.. ప్లస్ అవుతుందని గట్టిగానే చెబుతున్నారు. వాస్తవంగా ఆన్సర్ టీచర్ చెప్పిందే కరెక్ట్.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…