ఒకేసారి రెండు డోసుల కరోనా టీకా వేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్పేట్ జడ్పీ హైస్కూల్లో కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈనేపధ్యంలో లక్ష్మీప్రసన్న అనే మహిళకు నర్సు పొరపాటున రెండు డోసులు వ్యాక్సిన్ వేసింది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.
కాగా.. ఆ మహిళ అప్పటికే మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకుంది. మొదటి డోసు వేసుకున్న మహిళను గమనించని నర్సు.. పొరపాటున వేరే మహిళ వచ్చిందనుకొని రెండో డోసు కూడా వేసినట్లు తెలుస్తోంది. రెండు వ్యాక్సిన్స్ వేసుకున్న లక్ష్మిప్రసన్నను వైద్య సిబ్బంది వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల పరిశీలన అనంతరం ఈ ఉదయం ఆమెను డిశ్ఛార్జి చేశారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…