ఎన్టీఆర్ … ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఎవరి ఫాన్స్ సంతోషంగా ఉన్నారు అని అడిగితే ఎన్టీఆర్ ఫాన్స్ అనే చెప్పాలి,కెరీర్ మధ్యలో వరుస ప్లాప్స్ తో ఢీలా పడ్డ తర్వాతా 2015 టెంపర్ నుండి మళ్ళి వెనక్కి తిరిగి చూసుకోలేదు,వరుసగా టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతా గారేజ్,జై లవ కుశ రూపంలో నాలుగు భారీ హిట్స్ అందుకొని దానికి తోడుగా ఇప్పుడు మొట్టమొదటి సారిగా బిగ్ బాస్ అనే టీవీ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తన ఫాన్స్ కి విందు భోజనాన్ని అందిస్తున్నాడు.
ఈ నెల 21వ తారీఖున విడుదల అయిన జై లవకుశ సినిమా విజయ వాంతంగా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది,ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ ని పొగడని వారు అంటూ ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు,టాప్ హీరోగా ఉంటూ విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకోవడమే గొప్ప అయితే ఆ పాత్రని విజయవంతంగా ప్రదర్శించి జనాల మన్ననలు అందుకోవడం అంటే మామూలు ఫంవిషయం కాదు,జై పాత్రలో ఆయన చూపించిన నాతనఆ చతురత ఈ తరం నటుల్లో ఆయనకు మాత్రమే సాధ్యం అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు అనేవారే…
అంత విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమాని ప్రమోట్ చేసే సందర్భంగా ఎన్టీఆర్ హీరోయిన్స్ రాశి ఖన్నా,నివేత థామస్ లతో కలిసి ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాశి గురించి నోరు జారారు,ఆమె షూటింగ్ కి లేట్ గా వస్తుందని అన్న ఎన్టీఆర్,వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పి, ఆ వీడియో డిలీట్ చేయవలసిందిగా మీడియా వారిని కోరారు,అయితే చూస్తున్న దాన్ని బట్టి ఎన్టీఆర్ ఆ మాటలను కేవలం జోవియల్ గా అన్నారని అర్ధం అవుతోంది.ఎన్టీఆర్ నువ్వు లేట్ గా రావు అక్కడే స్పాట్ లో పడుకొని పొద్దున్నే మేము వచ్చే సమయానికి లేస్తావు అని అన్న మాటలకి రాశి కూడా పగల బడి నవ్వింది.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…