టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా వెలిగాడు శ్రీను వైట్ల. కెరీర్ ప్రారంభంలో చిన్న హీరోలతో సినిమా తీసిన ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మాస్ మహారాజ రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ లాంటి స్టార్స్తో పెద్ద నిర్మాణ సంస్థలలో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్..ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. అయితే శ్రీనువైట్ల ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం మాత్రం అక్కినేని నాగార్జున. ఆయన ఇచ్చిన సలహా..టాలీవుడ్లో ఈ దర్శకుడిని అగ్ర తాంబూలం అందుకునేలా చేసింది. ఒక దశలో ఈ డైరెక్టర్కి నిర్మాతలు భారీగా అడ్వాన్సులు ఇచ్చేవారు. అలాంటిది ఒక్కసారిగా కెరీర్ డైలమాలో పడింది.
శ్రీను వైట్ల ఇండస్ట్రీలోకి రావడం ఒక మిరాకిల్ అని చెప్పాలి. ఆయన తూర్పుగోదావరి జిల్లాకి చెందినవాడు. అక్కడే ఉండే ఓ డిస్టిబ్యూటర్ ద్వారా గోగినేని సుబ్బారావు అనే నిర్మాత పరిచయమయ్యాడు. ఆయన చిన్ని కృష్ణుడు, పడమటి సంధ్యారాగం అనే సినిమాల నిర్మాణంలో పార్టనర్. ఆయన శ్రీను వైట్లకి సినిమాల మీద ఉన్న ఆసక్తి తెలుసుకుని చలసాని రామారావు అనే డైరెక్టర్ కి పరిచయం చేశారు. చలసాని రామారావు.. నట సింహం నందమూరి బాలకృష్ణతో ‘ప్రాణానికి ప్రాణం’ అనే సినిమా తీస్తున్నారు.
ఆ సినిమాకి చలసాని రామారావు వద్ద అప్రెంటీస్ గా చేరాడు. ఇలా శ్రీను వైట్ల 1989 లో సినిమా రంగంలో అడుగుపెట్టాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత శివ సినిమాతో రాంగోపాల్ వర్మ పేరు అంతటా మార్మోగిపోయింది. దాంతో వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేరదామని శ్రీను వైట్ల హైదరాబాదు వచ్చాడు. కాని వర్మ వద్ద అప్పటికే అసిస్టెంటుగా చేరడానికి వచ్చిన వాళ్ళ క్యూ చాలా పెద్దగా ఉండింది. దాంతో ముందు ప్రాణానికి ప్రాణం సినిమా సమయంలో పరిచయమైన డైరెక్టర్ సాగర్ వద్ద అసిస్టెంట్ గా చేరాడు. అలా ‘నక్షత్రపోరాటం’ అనే సినిమాకి పని చేశాడు.
అలా సాగర్ గారి వద్ద సూపర్ స్టార్ కృష్ణ నటించిన అమ్మదొంగా సినిమా వరకూ పనిచేశాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల సొంతంగా డైరెక్షన్ చేయాలని డిసైడయ్యాడు. ఈ నేపథ్యంలో కథలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా రవితేజ – మహేశ్వరీ జంటగా నీకోసం సినిమా మొదలు పెట్టాడు. కానీ ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ అన్నీ కష్టాలే. నిర్మాతలు తలా ఒక రెండు, మూడు లక్షలు వేసుకుని ప్రాజెక్టు మొదలెట్టారు, కానీ మధ్యలో బడ్జెట్ అయిపోవడంతో శ్రీను వైట్లనే కొంత పెట్టుబడి పెట్టాడు. అలా నానా కష్టాలూ పడి ‘నీకోసం’ సినిమాని పూర్తిచేశాడు.
కేవలం 38 లక్షల్లో 28 వర్కింగ్ డేస్ లో తీసిన సినిమా పూర్తి కావడానికి మొత్తం సంవత్సరంన్నర పట్టింది. ఈ సినిమా ప్రివ్యూ చూసిన నాగార్జున..శ్రీను వైట్లకి దర్శకుడిగా అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశాడు. అయితే మంచి కామెడీ ట్రాక్ ఉంటే నీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయని సలాహా ఇచ్చారు. ‘నీకోసం’ సినిమాకి సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అందించిన సాంగ్స్ పెద్ద హిట్. టైటిల్ సాంగ్ అయితే ఇప్పటికీ వినిపిస్తుంది. అలా ఆ తర్వాత నుంచి శ్రీను వైట్ల నాగార్జున చెప్పినట్టు హెల్దీ కామెడీ ట్రాక్ పెడూతూ వచ్చి స్టార్ డైరెక్టర్ అయ్యాడు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…