వాస్తవ కథలను ఈ మధ్య తెరకెక్కించడంలో చిత్ర దర్శక నిర్మాతలు ముందు ఉంటున్నారు. ఇటీవల దీని నేపథ్యంలో వచ్చిన సినిమా జై భీమ్. ఇది అమెజాన్ ఓటీటీలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సూర్య హీరోగా దీనిలో అద్భుతంగా నటించాడు.
ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడంతో వాస్తవ కథలను మంచిగా తీర్చిదిద్దితే ప్రేక్షకులు ఆదిరిస్తారు అనే దానికి ఇదే చక్కని ఉదాహరణ. ఇదిలా ఉండగా.. రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని.. డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ కథ అన్నీ కథలకంటే కాస్త బిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడదుల చేశారు. ఈ పోస్టర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. శ్రీకాంత్ అయ్యంగార్, మోహన్, నవీన్ చంద్ర మూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వాళ్లు ముగ్గురు ఉండే విధంగా ఈ పోస్టర్ ను రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’ అంటూ సాగుతుంది. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ పాటను సింగర్ మంగ్లీ పాడారు. దీనిని నవంబర్ 26న విడుదల చేస్తున్నట్లు.. దానికి సంబంధించిన రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు.
దీనికి కోటి స్వరాలను అందించడంతో పాటు.. ఈ సినిమా లో అతడు ఓ పాత్రను కూడా పోషించాడు.
ఈ చిత్రాన్ని ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ నిర్మించారు. దీనికి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం డాక్టర్ మోహన్ వ్యవహరిస్తున్నారు. కెమెరా మెన్ గా చిట్టిబాటు, ఎడిటింగ్ గా నందమూరి హరి ఉన్నారు. బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు నటీనటులుగా ఉన్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…