దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా కేసుల సంఖ్య పెరగడం లేదు. కరోనా బాధితుల వైద్య చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతూ ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా బాధితులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తోంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఈ రుణాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు 1,33,080 మంది లబ్ధిదారులు ఐదు లక్షల రూపాయల చొప్పున రుణం పొందారని వెల్లడించారు. రుణం పొందిన వాళ్లలో తెలంగాణకు చెందిన వాళ్లు 3,389 మంది ఏపీకి చెందిన వాళ్లు 2,791 మంది ఉన్నారని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే ఈ రుణాలను టర్మ్ రుణాలుగా పరిగణిస్తారని కేంద్రం తెలిపింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు మంజూరు చేసిన ఈ రుణాలను మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించడం గమనార్హం. సమీపంలోని ప్రభుత్వ రంగ బ్యాంకును సంప్రదించి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
కరోనా సోకి చికిత్సకు ఎక్కువ మొత్తం ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడితే ఈ విధంగా సులభంగా రుణాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గినా జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…