AP News: ప్రస్తుత కాలంలో రోజురోజుకు మోసం చేసే వారి సంఖ్య అధికమవుతుంది. మోసేపోయేవారు ఉన్నన్ని రోజులు మోసం చేస్తూనే ఉంటారు అన్నట్టు రోజురోజుకు మోసాల సంఖ్య అధికమవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద ఎత్తున ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ అబ్బాయిలను మోసం చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో ఒకటి బయటపడింది. చిత్తూరు జిల్లాకు చెందిన శరణ్య అనే ఓ మహిళకు 54 సంవత్సరాలు. అయితే ఈమె మేకప్ వేసి వయస్సు బయటకు కనపడకుండా బాగా కవర్ చేశారు.ఇలా మేకప్ తో తనకు 30 సంవత్సరాలేనని చెబుతూ ఈమె 35 ఏళ్ల యువకుడిని వివాహం ఆడింది. ఇక పెళ్లి అయిన తర్వాత తన అసలు నాటకం బయటపెట్టింది.
ఆ యువకుడి పేరుపై ఉన్న ఆస్తిని మొత్తం తన పేరుకు మార్చాలంటూ ప్రతిరోజు ఆ యువకుడిని వేధింపులకు గురి చేసేది. ఈ విధంగా ఆ మహిళ టార్చర్ భరించలేక ఆ యువకుడు ఆస్తి తన పేరుపై మార్చడానికి తన ఆధార్ కార్డు తీసుకున్నారు.అయితే ఆధార్ కార్డులో ఆమె వయసుతో పాటు ఆమె మొదటి భర్తకు సంబంధించిన వివరాలు కూడా ఉండడంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయ్యాడు.
ఈ విధంగా తనకు ముందుగానే పెళ్లి జరిగిందని అంతేకాకుండా తన వయసు 55 సంవత్సరాలని తెలియడంతో ఒక్కసారిగా ఆ యువకుడు కంగుతున్నాడు. ఈ విధంగా శరణ్య తనని మోసం చేయడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఆ యువతకి వివాహం జరిగి ఇద్దరు కూతుర్లు ఉండడమే కాకుండా వారికి కూడా వివాహాలు జరిగాయి.అంతేకాకుండా ఆ యువకుడితో శరణ్యకు ఇది రెండవ వివాహం కాదు మూడవ వివాహం అని తెలియడంతో ఆ యువకుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రపంచ ఆర్థిక గణాంకాలను ప్రభావితం చేసే ఒక అంశం “బంగారు నిల్వలు” (Gold Reserves). యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల…
ఇంట్లో చిన్నారి పుట్టిన క్షణం నుంచి ఆనందం మొదలవుతుంది. కానీ ఆ ఆనందంతో పాటు ఒక ముఖ్యమైన చర్చ కూడా…
కాలేయం (లివర్) మన శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో ఒకటి. శరీరానికి అవసరమైన పోషకాలను ప్రాసెస్ చేయడం, విషపదార్థాలను బయటకు…
దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రాధికా శరత్ కుమార్ మరోసారి వార్తల్లో…
ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…
కొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ మార్కెట్లోకి రాబోతోంది. అంతకు ముందే, S24 స్మార్ట్ఫోన్ ధరలో పెద్ద తగ్గింపు…