AP News: ప్రస్తుత కాలంలో రోజురోజుకు మోసం చేసే వారి సంఖ్య అధికమవుతుంది. మోసేపోయేవారు ఉన్నన్ని రోజులు మోసం చేస్తూనే ఉంటారు అన్నట్టు రోజురోజుకు మోసాల సంఖ్య అధికమవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద ఎత్తున ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ అబ్బాయిలను మోసం చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో ఒకటి బయటపడింది. చిత్తూరు జిల్లాకు చెందిన శరణ్య అనే ఓ మహిళకు 54 సంవత్సరాలు. అయితే ఈమె మేకప్ వేసి వయస్సు బయటకు కనపడకుండా బాగా కవర్ చేశారు.ఇలా మేకప్ తో తనకు 30 సంవత్సరాలేనని చెబుతూ ఈమె 35 ఏళ్ల యువకుడిని వివాహం ఆడింది. ఇక పెళ్లి అయిన తర్వాత తన అసలు నాటకం బయటపెట్టింది.

ఆ యువకుడి పేరుపై ఉన్న ఆస్తిని మొత్తం తన పేరుకు మార్చాలంటూ ప్రతిరోజు ఆ యువకుడిని వేధింపులకు గురి చేసేది. ఈ విధంగా ఆ మహిళ టార్చర్ భరించలేక ఆ యువకుడు ఆస్తి తన పేరుపై మార్చడానికి తన ఆధార్ కార్డు తీసుకున్నారు.అయితే ఆధార్ కార్డులో ఆమె వయసుతో పాటు ఆమె మొదటి భర్తకు సంబంధించిన వివరాలు కూడా ఉండడంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయ్యాడు.
ఆస్తికోసం మోసానికి పాల్పడిన యువతి…
ఈ విధంగా తనకు ముందుగానే పెళ్లి జరిగిందని అంతేకాకుండా తన వయసు 55 సంవత్సరాలని తెలియడంతో ఒక్కసారిగా ఆ యువకుడు కంగుతున్నాడు. ఈ విధంగా శరణ్య తనని మోసం చేయడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఆ యువతకి వివాహం జరిగి ఇద్దరు కూతుర్లు ఉండడమే కాకుండా వారికి కూడా వివాహాలు జరిగాయి.అంతేకాకుండా ఆ యువకుడితో శరణ్యకు ఇది రెండవ వివాహం కాదు మూడవ వివాహం అని తెలియడంతో ఆ యువకుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

































