భార్య వండిన చికెన్ బాగా వండలేదని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ భర్త. తర్వాత ఆమె శవాన్ని ఓ సరస్సులో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాడు. ఐదు సంవత్సరాల క్రితం కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన 30 ఏళ్ల పాషా, 28 ఏళ్ల షరిన్ భాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అతడు బెడ్స్ అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఓ రోజు షరిన్ చెల్లి వాళ్ల ఇంటికి వచ్చింది. మరదలు వచ్చింది కదా అన్ని పాషా.. బయటకు వెళ్లి చికెన్ తీసుకొని వచ్చాడు. అయితే ఆమె దానిని ఫ్రై చేసింది. ఇంట్లో వాళ్లంతా కలిసి తింటున్న క్రమంలో చికెన్ మంచిగా వండలేదని.. ఇదేం వంట చేయడం అంటూ .. షరిన్ పై తన చెల్లి ముందే గొడవ పడ్డాడు.
పెళ్లి అయి ఇన్నాళ్లు అవుతున్నా వంట వండటం రాదా అంటూ ఆమెపై కస్సుబుస్సు అయ్యాడు. తన చెల్లి ముందే అతడు ఇన్ని మాటలు అన్నందకు షరిన్ బాగా బాధపడింది. తన చెల్లి ఉన్నన్ని రోజులు గొడవలు లేకుండా ఇద్దరు ఉన్నారు. ఆమె వెళ్లిన దగ్గర నుంచి మళ్లీ గొడవ పడటం మొదలు పెట్టారు.
ఓ రోజు పిల్లలు పడుకున్న సమయంలో మళ్లీ అతడు ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై బలంగా బాదాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమె శవాన్ని చిక్కబనవర లేక్లో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని మృతదేహం కోసం ఆ సరస్సులో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…