బిగ్ బాస్ 5 తెలుగులో హౌజ్ లో అడుగు పెట్టిన 19 మంది కంటెస్టెంట్లలో మానస్ కూడా ఒకరు. అందులో కూడా ప్రస్తుతం మానస్ టాప్ 5 లో ఉన్నాడు. మానస్ పలు సీరియళ్లలో కాకుండా.. సినిమా హీరోగా కూడా రెండు సినిమాల్లో నటించాడు. ఇక మానస్ కు హౌజ్ లోకి వెళ్లకముందు ఉన్న క్రేజ్ వెళ్లిన తర్వాత ఇంకా పెరిగిపోయింది.
ఫ్యాన్ బేస్ విపరీతంగా పెంచుకున్నాడు మానస్. అతడు హౌజ్ లో మెచ్యూర్డ్ థింకింగ్తో అటు కుటుంబ ప్రేక్షకుల్ని, ఇటు యువతని అమితంగా ఆకట్టుకున్నాడు. సైలెంట్ గా తన పని తాను కానిస్తాడని పేరు ఉంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అతడు హీరోగా మరో సినిమాకు కన్ఫర్మ్ అయ్యాడు. ‘5జి లవ్’ అనే చిత్రంలో మానస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
‘స్క్వేర్ ఇండియా స్టూడియోస్ బ్యానర్పై ప్రతాప్ కోలగట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇక అతడు హౌజ్ నుంచి బయటకు రాగానే మరికొన్ని ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. బాలనటుడిగానే అతడు ఎన్నో సినిమాల్లో నటించాడు. కాగా మానస్ ‘బిగ్ బాస్’ క్రేజ్ వల్ల అతను నటించిన సినిమాలకు కూడా ప్లస్ అవుతుందనే చెప్పాలి.
ఎందుకంటే.. అతడు 2021లో హీరోగా నటించిన సినిమా క్షీర సాగర మథనం. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విపరీతంగా ప్రేక్షకాధరణ పొందుతోంది. అతడు హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఓటీటీలో విడుదలవ్వగా.. ప్రస్తుతం అనూహ్య స్పందన వస్తోంది. ఇక హౌస్ నుంచి బయటకి వచ్చిన వెంటనే మానస్ మరిన్ని ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. ఇక ఈ విషయం తెలవడంతో మానస్ తల్లితో పాటు.. ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…