ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు.ఈ క్రమంలోనే మరి కొందరు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ పత్రాలు సృష్టించి
కొవిడ్ సహాయ నిధిని పొంది, లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన వ్యక్తి చివరికి కటకటాల పాలైన ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…
కాలిఫోర్నియాకు చెందిన ముస్తఫా ఖాద్రీ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. అయితే అక్కడి ప్రభుత్వం చిన్న వ్యాపారులకు సహాయ నిధులు ప్రకటించింది. ముస్తఫా తన అతి తెలివితేటలు ప్రదర్శించి నకిలీ పత్రాలను సృష్టించాడు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా తనకు ఒక కంపెనీ ఉందని ప్రస్తుత పరిస్థితుల వల్ల తను ఎంతో నష్టపోయానని తెలుపుతూ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ విధంగా నకిలీ పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న ముస్తఫా కొవిడ్ సహాయ నిధిని పొందాడు. అనంతరం సహాయ నిధి ద్వారా వచ్చిన డబ్బుతో ఖరీదైన లంబోర్గిని, ఫెరారీ కార్లను కొనుగోలు చేసాడు. అధికారులు ఎంక్వయిరీ కోసం అతని ఇంటికి వెళ్లగా అతని ఇంటి ఆవరణంలో ఉన్న కార్లను చూసి అధికారులు ఖంగుతిన్నారు.
అనంతరం విచారణ చేపట్టిన అధికారులు ముస్తఫా ఫై పోలీస్ లకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ముస్తఫాను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అతని దగ్గర నుంచి కార్ల తో పాటు 20 లక్షల డాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…