ప్రస్తుతం టెక్నాలటీ ఎంతో దూసుకుపోతోంది. అంతరిక్షంలోకి కూడా మనుషులు వెళ్తున్నారు. ఇతర గ్రహాలపై కూడా రాకెట్లను పంపుతున్న రోజులివి. ఇలాంటి రోజుల్లోకూడా మూఢ నమ్మకాలు ఆగడం లేదు. నమ్మే వాళ్లు ఉంటే.. నమ్మించేవారు ఉంటూనే ఉంటారు. ఘోరం ఏంటంటే.. చదువుకున్న మూర్ఘులు కూడా ఈ ముఢనమ్మకాలను నమ్మేస్తున్నారు. క్షద్రపూజల పేరుతో మనిషిని బలి తీసుకున్న ఘటనలు మనం వింటూనే ఉన్నాయి.
అలాంటి ఘటనే ఒకటి బిహార్ లో వెలుగు చూసింది. బిహార్ లోని ముంగేర్ జిల్లాలో దిలీప్ కుమార్ కు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి నుంచి అతడి భార్య గర్భం దాల్చడం.. కొన్ని రోజులకు అబార్షన్ కావడం జరుగుతంది. ఇలా బార్యకు వరుసగా అబార్షన్లు అవుతున్నాయని.. అతడు ఓ రోజు తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. దానికి అతడు ఏం సలహా ఇచ్చాడో తెలుసా.. అలా జరగకుండా ఉండాలంటే మైనర్ బాలికను బలివ్వాలని చెప్పాడు.
దీంతో మీ భార్య గర్భం నిలిచి.. పండంటి బిడ్డకు జన్మనిస్తుందని తెలిపాడు. అనుకున్నట్లుగానే ఆగస్టు 4న ఓ బాలిక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న తన తండ్రికి భోజనం ఇచ్చేందుకు వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. అతడు ఆమెను ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి ఆ బాలికను బలిచ్చాడు. ఆమె కళ్లు పీకేసి.. రక్తంతో క్షుద్రపూజలు చేశాడు. తర్వాత ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.
పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా దిలీప్ కుమార్ వ్యవహారం బయటపడింది. అతడిని అరెస్ట్ చేసి తమ దైన స్టైల్లో విచారించారు. దీంతో దీనికి కారణం అయిన వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే బాధిత మహిళ కుటుంబసభ్యులు తమ కూతురును నరబలి కోసం హత్య చేయలేదని.. అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…