ప్రస్తుతం టెక్నాలటీ ఎంతో దూసుకుపోతోంది. అంతరిక్షంలోకి కూడా మనుషులు వెళ్తున్నారు. ఇతర గ్రహాలపై కూడా రాకెట్లను పంపుతున్న రోజులివి. ఇలాంటి రోజుల్లోకూడా మూఢ నమ్మకాలు ఆగడం లేదు. నమ్మే వాళ్లు ఉంటే.. నమ్మించేవారు ఉంటూనే ఉంటారు. ఘోరం ఏంటంటే.. చదువుకున్న మూర్ఘులు కూడా ఈ ముఢనమ్మకాలను నమ్మేస్తున్నారు. క్షద్రపూజల పేరుతో మనిషిని బలి తీసుకున్న ఘటనలు మనం వింటూనే ఉన్నాయి.
అలాంటి ఘటనే ఒకటి బిహార్ లో వెలుగు చూసింది. బిహార్ లోని ముంగేర్ జిల్లాలో దిలీప్ కుమార్ కు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి నుంచి అతడి భార్య గర్భం దాల్చడం.. కొన్ని రోజులకు అబార్షన్ కావడం జరుగుతంది. ఇలా బార్యకు వరుసగా అబార్షన్లు అవుతున్నాయని.. అతడు ఓ రోజు తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. దానికి అతడు ఏం సలహా ఇచ్చాడో తెలుసా.. అలా జరగకుండా ఉండాలంటే మైనర్ బాలికను బలివ్వాలని చెప్పాడు.
దీంతో మీ భార్య గర్భం నిలిచి.. పండంటి బిడ్డకు జన్మనిస్తుందని తెలిపాడు. అనుకున్నట్లుగానే ఆగస్టు 4న ఓ బాలిక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న తన తండ్రికి భోజనం ఇచ్చేందుకు వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. అతడు ఆమెను ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి ఆ బాలికను బలిచ్చాడు. ఆమె కళ్లు పీకేసి.. రక్తంతో క్షుద్రపూజలు చేశాడు. తర్వాత ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.
పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా దిలీప్ కుమార్ వ్యవహారం బయటపడింది. అతడిని అరెస్ట్ చేసి తమ దైన స్టైల్లో విచారించారు. దీంతో దీనికి కారణం అయిన వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే బాధిత మహిళ కుటుంబసభ్యులు తమ కూతురును నరబలి కోసం హత్య చేయలేదని.. అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…