కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితుడైన మైనర్ బాలుడు ఒక క్రిమినల్గా మారాలని కలలు కన్నాడు. పోలీసుల దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.
కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడు ఆమె పక్క ఇంట్లో ఉండే 14 ఏళ్ల బాలుడని పోలీసులు గుర్తించారు. క్రికెట్ బ్యాట్ దొంగిలించడానికి వెళ్లిన బాలుడిని సహస్ర చూసిందని, ఆమె అరిచిందని భయపడి ఆ బాలుడు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టంలో బాలిక మెడపై 14, పొట్టపై 7 సహా మొత్తం 21 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. ఈ దారుణ ఘటన తర్వాత బాలుడు ఇంటికి వెళ్లి రక్తపు మరకలను కడిగి, స్నానం చేసి ఏమీ తెలియనట్లు నటించాడు.
పోలీసుల విచారణలో బాలుడు క్రైమ్ సిరీస్ లు, సినిమాలు ఎక్కువగా చూసేవాడని వెల్లడైంది. అతని ఫోన్ లో వందల కొద్దీ క్రైమ్ సిరీస్ ఎపిసోడ్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్రైమ్ సిరీస్ లు చూసే అలవాటు కారణంగానే నేరం చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. అంతేకాదు, తాను భవిష్యత్తులో ఒక క్రిమినల్ కావాలని కూడా ఆ బాలుడు ఒక నోట్ లో రాసుకున్నాడు. ఆ నోట్ లో దొంగతనం ఎలా చేయాలి, తర్వాత ఎలా పారిపోవాలి వంటి విషయాలను కూడా రాసుకున్నాడు. అయితే, సహస్ర హత్యకు ఈ నోట్ కు సంబంధం లేదని, హత్య కేవలం క్రికెట్ బ్యాట్ కోసం చేసిన దొంగతనం విఫలమవడం వల్ల జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు.
బాలిక సహస్ర షెడ్యూల్డ్ కులానికి చెందినది కావడంతో పోలీసులు నిందితుడైన బాలుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేవలం ఐదు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…