ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా హింసించారు తండావాసులు. అంతే కాకుండా ఒక గంట పాటు కర్రలతో కొట్టుకుంటూ ఊరంతా ఊరేగించారు. ఈ అమానూష ఘటన సూర్యాపేట జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట మండలం రాజునాయక్తండాకు చెందిన శంకర్నాయక్ జూన్ 13న హత్యకు గురయ్యారు.
ఈ హత్య కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇటీవల ఆమె బెయిల్ పై విడుదలై తన సోదరి ఇంట్లో తలదాచుకుంటోంది. తండాలో తన బంధువు చనిపోతే.. అంత్యక్రియల నిమిత్తం వెళ్లింది. శంకర్ నాయక్ చనిపోయిన తర్వాత ఆమె వాళ్లకు మొదటి సారి కనిపించింది.
హత్యకు గురైన బంధువులు ఆమెను చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమెను బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కొచ్చి.. వివస్త్రను చేసి.. కంట్లో కారం చల్లి చిత్ర హింసలకు గురిచేశారు. అంతేకాకుండా ఆమెను కర్రలతో కొట్టుకుంటూ గ్రామంలో ఊరేగించారు. ఈ తతంగం మొత్తం ఒక గంట పాటు జరిగింది. చుట్టు పక్కల వాళ్లు చూస్తున్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు.
దీంతో ఆమె అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని ఎంపీటీసీ ఇంట్లోకి వెళ్లింది. అక్కడ ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఆమెకు దుస్తులను ఇచ్చి.. ఓ గదిలో రక్షణ కల్పించింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…