Aadi Sai Kumar: ప్రముఖ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ ప్రేమ కావాలి ‘ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఆది సరైన హిట్స్ అందుకోలేకపోయాడు. అయినప్పటికీ హిట్ ఫ్లాఫ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా అది మొదటిసారిగా తన భార్యతో కలిసి టీవీ షోలో పాల్గొని సందడి చేశాడు. వెన్నెల కిషోర్ హోస్టుగా వ్యవహరిస్తున్న’ అలా మొదలైంది ‘ షోలో ఆది, అరుణ దంపతులు సందడి చేశారు. ఈ షోలో ఆది, అరుణ తమ వివాహ బంధం గురించి పంచుకున్న సరదా ముచ్చట్లు పంచుకుంటూ సందడి చేశారు. ఆది, అరుణని పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ షోలో అరుణ తన పెళ్లి చూపుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఈ క్రమంలో ఆది మాట్లాడుతూ…” మా పెళ్లి చూపులు ఎయిర్ పోర్ట్ లో జరిగాయి. మామయ్యగారు (సాయికుమార్) ఏదో ఊరు వెళ్లాలని ఎయిర్పోర్టుకి వెళ్లిన సమయంలో మా పేరంట్స్ కూడా అదే టైంకి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు నాకు ఫోన్ చేసి ఎయిర్పోర్టుకు రా అని పిలిచారు. నేను వెళ్లేసరికి వాళ్లంతా నా కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడే మా పెళ్లిచూపులు జరిగాయి అంటూ అరుణ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత ఆది నా ఫోన్ నంబర్ అడిగితే మా నాన్నను అడిగి ఇచ్చాను అని తెలిపింది.
ఆది అందుకొని.. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. నువ్వు మీ నాన్నను అడిగి నాకు నంబర్ ఇచ్చావా అనగానే అరుణా నవ్వేసింది. పెళ్ళి చూపులు అయ్యాక ఇద్దరం పక్కకు వెళ్ళి దాదాపు గంట సేపు మాట్లాడుతున్నాం. మధ్యలో మా పేరెంట్స్ వచ్చి డిస్టర్బ్ చేశారు. లేకపోతే ఇంకా ఎక్కువ సమయం మాట్లాడుకునేవాళ్ళం అంటూ ఆది చెప్పుకొచ్చాడు.
ఇక ఇద్దరు మొదట ఎప్పుడు గొడవపడ్డారు అని వెన్నెల కిషోర్ ప్రశ్నించగా… హనీమూన్ లో మొదటిసారి ఇద్దరం గొడవపడ్డాము అని ఆది తెలిపాడు. ఇలా సరదా సంభాషణతో షో మొత్తం ఎంతో సందడిగా సాగిపోయింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…