Shruthi Hassan: కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ ఈ ఏడాది రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య,వీర సింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక శృతిహాసన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శృతిహాసన్ ఎలాంటి సినిమాలను ప్రకటించలేదని భావించారు. అయితే ఈమె నాని హీరోగా నటిస్తున్న తన 30 వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్లో కూడా శృతిహాసన్ పాల్గొన్నారు.
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శృతిహాసన్ నటించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో శృతిహాసన్ నానికి జోడిగా నటిస్తున్నారా.. లేక ఏదైనా కీలకపాత్రలో నటిస్తున్నారా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం శృతిహాసన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
నాని నటించిన దసరా సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో నానికి ఒక కూతురు కూడా ఉండబోతుందని ఈ సినిమా తండ్రి కూతురు సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత నాని నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ద్వారా నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…