గత కొద్ది రోజుల నుంచి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కాదని, బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లేనంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజుకొక వార్త బిగ్ బాస్ గురించి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
సెప్టెంబర్ ఐదు నుంచి బిగ్ బాస్ ప్రసారం కాబోతుందని పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోగోను కూడా విడుదల చేయడంతో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సారి సీజన్లో పాల్గొనేవారు వీరే అంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ జస్వంత్, యాంకర్ రవి, శేఖర్ మాస్టర్, వర్షిని, లోబో, ప్రియాంక సింగ్, కార్తీక దీపం భాగ్యం, బుల్లితెర నటి ప్రియా, tv9 ప్రత్యూష, నటి సురేఖ వాణి వంటి వారి పేర్లు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈసారి సీజన్ లో ఆట సందీప్ కంటెస్టెంట్ గా వెళ్లనుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్లో కూడా ఓ జంట బిగ్ బాస్ హౌస్ లోనికి పంపించనున్నారు. ఈ క్రమంలోనే ఆట సందీప్ అతని భార్యను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పంపించినట్లు తెలుస్తోంది.
తాజాగా ఆట సందీప్ చేసిన ట్వీట్ వైరల్ గా మారడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ ఫేస్ బుక్ స్టోరీలో బిగ్ బాస్ షో కి సంబంధించి ఒక పోల్ పెట్టారు. మమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది చూడాలనుకుంటున్నారు? అని పోస్ట్ చేయగా దాదాపు 81 శాతం మంది ఈ జంటను బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుని భావించారు.అయితే ప్రస్తుతం సందీప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి తను కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ట్వీట్ బట్టి చూస్తే ఆట సందీప్ అతని భార్య బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…
ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు, అసమతుల్య ఆహారం, ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య…
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…