Jabardasth Phani : జబర్దస్త్ లో బానిస బతుకు బతకలేక, వాళ్ళు వేసే మెతుకులు తినలేక బయటికి వచ్చేసానని యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కిర్రాక్ ఆర్పి చేసిన తీవ్ర విమర్శలు బాగా వైరల్ అయ్యాయి. జబర్దస్త్ ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వడం కాదు మేమే జబర్దస్త్ కు జీవితాన్ని ఇచ్చాము అంటూ కామెంట్స్ చేసాడు ఆర్పి అక్కడ ఎవరిని మనుషుల్లా చూడరు అంటూ మల్లెమాల సంస్థను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఇక వీటిపై జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ అలాగే జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన కమెడియన్స్ పలు ఇంటర్వ్యూ ల్లో మాట్లాడుతూ జబర్దస్త్ లో జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నారు.
మల్లెమాల సంస్థలో అదే జరిగేది….
జబర్దస్త్ మానేసి ఐదేళ్ళు దాటి పోయింది మేము ఉన్న రోజుల్లో జబర్దస్త్ లో తిండి గురించి ఏ రోజు అనుకోలేదు స్కిట్లు ఎలా చేయాలి ఇంకా ఎంత బాగా చేయాలి అన్నదాని మీదే మా ఫోకస్ ఉండేది అంటూ ఫణి చెప్పాడు. పేమెంట్ టైం కి ఇచ్చేవాళ్ళని తనకు అదిరే అభి టీం లో పని చెసేప్పుడు స్కిట్స్ కి ఇరవై ఐదు వేలు ఇచ్చేవాడని కామెడీ స్కిట్స్ కి లక్షల్లో సంపాదన జబర్దస్త్ వల్లే వచ్చింది అంటూ చెప్పాడు. కిర్రాక్ ఆర్పి నాకు తమ్ముడు కానీ తనకు అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కావడం లేదని, నాగబాబు గారు చాలా మంచివారని చెప్పాడు. తన కూతురు చదువుకు నాగబాబు సహాయం చేసారని జబర్దస్త్ లో వాళ్ళను బయటకు తీసి సొంత కామెడీ షో చేయాల్సిన అవసరం నాగబాబు గారికి లేదని వివరించాడు. ఆయన అనుకుంటే చిరు తోనో లేక పవన్ తోనే సినిమా చేయొచ్చు కదా ఇలాంటి చిన్న విషయాలు ఎందుకు పట్టించుకుంటాడు అంటూ అభిప్రాయ పడ్డాడు.
సుధీర్, రామ్ ప్రసాద్, శీను ముగ్గురి స్నేహం చాలా బాగుంటుందని ఇప్పటికి వాళ్ళు అలానే ఉన్నారు, మేనేజర్ ఏడు కొండలు జబర్దస్త్ లో ఉన్నపుడు అన్ని తానే చూసుకునే వాడు ఇప్పుడు జబర్దస్త్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు అంటూ చెప్పారు. సుదీర్ గురించి ఏడుకొండలు చెప్పినవన్నీ అబద్దాలే.. తన మంచితనం టాలెంట్ వల్లే సుధీర్ కి అంత మంది అభిమానులు ఉన్నారంటూ చెప్పాడు. మొత్తానికి కిర్రాక్ ఆర్పి చేసిన విమర్శలను నిజం కాదు అంటూ చెప్పకనే చెప్పాడు జబర్దస్త్ ఫణి. మళ్ళీ జబర్దస్త్ లో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…