Categories: FeaturedGeneral News

ఉద్యోగాలు వదులుకుంటే బంపర్ ఆఫర్.. అదేమిటంటే…

దేశంలో ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. భారత్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి ఇంకెంత కాలం పడుతుందో తెలీదు. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం మనిషి జీవితంలో భాగమైపోయాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రాజెక్టులు తగ్గాయి. కొత్త ఉద్యోగాల కల్పన సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉండటంతో ఉద్యోగులు పడుతున్న బాధ వర్ణణాతీతం.

పలు కంపెనీలు ఉద్యోగులకు రెండు, మూడు నెలల ముందస్తు వేతనాలు చెల్లించి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. మిగతా కంపెనీలలాగా ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ యాక్సెంచర్ సైతం ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమైంది. కంపెనీలో ఉన్న ఉద్యోగులలో 5 శాతం ఉద్యోగులకు తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
 
అయితే మిగతా కంపెనీల్లా కాకుండా ఉద్యోగాలు వదులుకునే వారికి 7 నెలల వేతనం చెల్లించడానికి కంపెనీ సిద్ధపడటం గమనార్హం. చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగాలు వదులుకున్న వారికి ఇస్తున్న మొత్తంతో పోలిస్తే 7 నెలల వేతనం అంటే పెద్ద మొత్తం కావడం గమనార్హం. టెక్నాలజీకి తక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో 5 శాతం ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఉద్యోగాల్లో కోత విధిస్తున్న కంపెనీ ప్రతి సంవత్సరం ఉద్యోగాల కోత సహజమేనని చెబుతోంది.
 
యాక్సెంచర్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో నైపుణ్యం లేని వాళ్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. టెక్నాలజీకి డిమాండ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులను తొలగించి ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నట్టు తెలుస్తోంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago