భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. దేశంలో ప్రతిరోజూ 70,000కు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేసే అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలో కరోనాకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నోటిపూత కరోనా లక్షణమే అని చెప్పిన వైద్యులు ప్రస్తుతం నోట్లో దద్దుర్లు కూడా కరోనా లక్షణమేనని ఈ లక్షణం కనిపిస్తే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ముక్కు లేదా నోటి ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే నాలుక మీద బొడిపెలు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్పెయిన్ డాక్టర్లు 666 మంది కరోనా సోకిన రోగులపై అధ్యయనం చేసి నోటి దద్దుర్లు కూడా కరోనా లక్షణమేనని కనిపెట్టారు. కరోనా బారిన పడ్డ కొంతమంది రోగుల్లో రక్తహీనత కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
666 మంది రోజుల్లో 26 శాతం మంది రోగులలో ఈ లక్షణాలను గుర్తించామని.. తెలుపు, ఎరుపు రంగుల్లో చిన్న బొడిపెలు నాలికపై కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో పాటు నోట్లో బొడిపెలు కూడా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ రాషెస్ కరోనా రోగుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయని కొందరిలో కరోనా నుంచి కోలుకున్న తరువాత కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
మరోవైపు కరోనా సోకిన రోగుల్లో వాసనకు సంబంధించిన లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.వాసనను పీల్చుకునే నరాలను వైరస్ బ్లాక్ చేయడం వల్ల ఈ సమస్య కనిపిస్తుందని.. వాసన పూర్తిగా తెలియకపోవడాన్ని పారోస్మియా అంటారని.. సగం వాసన తెలియడాన్ని అనోస్మియా అంటారని.. వాసన, రుచి చాలాకాలంగా తెలియకపోతే దానిని ఫాంటోస్మియా అంటారని వెల్లడించారు.ఈ లక్షణం కూడా కరోనానే.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య నిపుణులు..?
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…
దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…
తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…
ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన…