బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు (జూలై 20వ తేదీ)1094 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో వంటలక్క రోషిణి దగ్గరకు వెళ్లి మోనిత, అంజి గురించి చెబుతుంది. ఈ క్రమంలోనే అంజి ద్వారా మోనిత చేసిన తప్పులను రోషిణికి చెబుతుంది. ఇది అంతా విన్న రోషిణి ఇప్పుడు అంజి ఎక్కడున్నాడు? అని అడగడంతో తెలియదు మేడమ్ అని సమాధానం చెబుతుంది. ఈ మాటలు విన్న రోషిణి ఈ కేసు కడుపు నుంచి క్రైమ్ దాకా వెళ్ళింది. నేను ఆరాతీస్తాను అని చెప్పడంతో దీప అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్తూ.. వెళ్తూ వెనక్కి తిరిగి”ఒక్క మాట మేడమ్..ఆ మోనిత మీకు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నేను మీకు ఇంత వివరణ ఇస్తున్నాను, లేకపోతే ఎవరి అవసరం లేకుండా ఆ మోనిత చేస్తున్న కుట్ర ఏంటో తెలుసుకుని దాన్ని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక కట్ చేస్తే భాగ్యం దీపా ఇంటికి వెళ్లి పిల్లలకు పాయసం పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దీప అది చూసి పిన్నిలో ఎంత మార్పు అంటూ చిన్నప్పుడు తనకి పెట్టిన కష్టాలను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత పిల్లలకు పాయసం పెట్టి వారిద్దరు మాట్లాడుకోవడానికి బయటకు వెళ్తారు. ఇక మోనిత చేతి కట్టు చూసుకుంటూ.. దీప అంజి గుర్తున్నాడా! దుర్గా గుర్తున్నాడా? అంటూ ఇచ్చిన వార్నింగ్ గుర్తుచేసుకుంటూ కంగారు పడుతుంది. ఒక వేళ వీళ్లు కనుక దొరికితే నేను చేసిన తప్పులు అన్ని బయటపడతాయి. నాకు శిక్ష తప్పదు ఎలాగైనా జరగబోయే ప్రమాదాన్ని ఆపాలంటూ కంగారు పడుతుంది. అప్పుడే ప్రియమణి ఎంటరై మీరు కడుపుతో ఉన్నారమ్మ…ఇలా టెన్షన్ పడకుండా విశ్రాంతి తీసుకోండి అని చెప్పడంతో కార్తీక్ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే నాకు విశ్రాంతి అంటూ అంత వరకు నాకు రెస్ట్ అనేది లేదు అంటూ గట్టిగా అరవడంతో ప్రియమణి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక రోషిణి దీప అన్న మాటలను గుర్తు చేసుకొని ఎంతమాట అంది,కంప్లైంట్ ఉంది కాబట్టి వివరణ ఇస్తుందట.. లేకపోతే నువ్వెంత అని నన్ను అన్నట్లుగా అంటూ మనసులో అనుకుంటుంది. ఈ విధంగా దీప గురించి ఆలోచిస్తూ.. ఇన్ని రోజులు నా సర్వీస్ లో నాతో ఈ విధంగా మాట్లాడిన వారు ఎవరూ లేరు. ఇది దీపలో ఉన్న కాన్ఫిడెన్సా.. లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా..ఈ విధంగా దీపా అన్న మాటలకు ఎంతో అవమాన పడుతున్న రోషిని అందులో నుంచి తేరుకుని ఈ కేస్ చాలా టిపికల్, నా ఇగోని పక్కనపెట్టి ఈ కేసును ఎంతో ప్రొఫెషనల్గా ఆలోచించాలి అంటూ… ఎవరికో ఫోన్ చేసి అంజి గురించి వివరాలను తెలుపుతుంది.
ఇక తన స్నేహితులు కొడుకును కలవడానికి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళినా ఆనందరావుకు అక్కడ 25వ తేదీ మోనిత, కార్తీక్ పెళ్లి చేసుకుంటారనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆనందరావు దీప ఇంటికి చేరుకొని మోనితని చేసుకొని ఆమె ఇంటికి వెళ్తావా… లేక ఆమెని ఇంటికి తీసుకు వస్తావా.. బ్లడీ ఫూల్ అంటూ కార్తీక్ ను తిడతాడు. ఈ ఘోరం చూడటానికేనా నా కోడలను బతికించావు అంటూ నిలదీస్తాడు.తన తండ్రి తిడుతుంటే కార్తీక్ మనసులోనే మోనిత ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలని అనుకుంటాడు. ఈ విధంగా ఆనందరావు తిడుతుంటే కార్తీక్ ఏం చేయాలో తోచక తలదించుకుని నిలబడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…