Connect with us

Featured

రోషిణి ఇగోని హర్ట్ చేసిన వంటలక్క.. రగిలిపోయిన ఏసీపీ..!

Published

on

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు (జూలై 20వ తేదీ)1094 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో వంటలక్క రోషిణి దగ్గరకు వెళ్లి మోనిత, అంజి గురించి చెబుతుంది. ఈ క్రమంలోనే అంజి ద్వారా మోనిత చేసిన తప్పులను రోషిణికి చెబుతుంది. ఇది అంతా విన్న రోషిణి ఇప్పుడు అంజి ఎక్కడున్నాడు? అని అడగడంతో తెలియదు మేడమ్ అని సమాధానం చెబుతుంది. ఈ మాటలు విన్న రోషిణి ఈ కేసు కడుపు నుంచి క్రైమ్ దాకా వెళ్ళింది. నేను ఆరాతీస్తాను అని చెప్పడంతో దీప అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్తూ.. వెళ్తూ వెనక్కి తిరిగి”ఒక్క మాట మేడమ్..ఆ మోనిత మీకు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నేను మీకు ఇంత వివరణ ఇస్తున్నాను, లేకపోతే ఎవరి అవసరం లేకుండా ఆ మోనిత చేస్తున్న కుట్ర ఏంటో తెలుసుకుని దాన్ని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఇక కట్ చేస్తే భాగ్యం దీపా ఇంటికి వెళ్లి పిల్లలకు పాయసం పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దీప అది చూసి పిన్నిలో ఎంత మార్పు అంటూ చిన్నప్పుడు తనకి పెట్టిన కష్టాలను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత పిల్లలకు పాయసం పెట్టి వారిద్దరు మాట్లాడుకోవడానికి బయటకు వెళ్తారు. ఇక మోనిత చేతి కట్టు చూసుకుంటూ.. దీప అంజి గుర్తున్నాడా! దుర్గా గుర్తున్నాడా? అంటూ ఇచ్చిన వార్నింగ్ గుర్తుచేసుకుంటూ కంగారు పడుతుంది. ఒక వేళ వీళ్లు కనుక దొరికితే నేను చేసిన తప్పులు అన్ని బయటపడతాయి. నాకు శిక్ష తప్పదు ఎలాగైనా జరగబోయే ప్రమాదాన్ని ఆపాలంటూ కంగారు పడుతుంది. అప్పుడే ప్రియమణి ఎంటరై మీరు కడుపుతో ఉన్నారమ్మ…ఇలా టెన్షన్ పడకుండా విశ్రాంతి తీసుకోండి అని చెప్పడంతో కార్తీక్ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే నాకు విశ్రాంతి అంటూ అంత వరకు నాకు రెస్ట్ అనేది లేదు అంటూ గట్టిగా అరవడంతో ప్రియమణి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఇక రోషిణి దీప అన్న మాటలను గుర్తు చేసుకొని ఎంతమాట అంది,కంప్లైంట్ ఉంది కాబట్టి వివరణ ఇస్తుందట.. లేకపోతే నువ్వెంత అని నన్ను అన్నట్లుగా అంటూ మనసులో అనుకుంటుంది. ఈ విధంగా దీప గురించి ఆలోచిస్తూ.. ఇన్ని రోజులు నా సర్వీస్ లో నాతో ఈ విధంగా మాట్లాడిన వారు ఎవరూ లేరు. ఇది దీపలో ఉన్న కాన్ఫిడెన్సా.. లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా..ఈ విధంగా దీపా అన్న మాటలకు ఎంతో అవమాన పడుతున్న రోషిని అందులో నుంచి తేరుకుని ఈ కేస్ చాలా టిపికల్, నా ఇగోని పక్కనపెట్టి ఈ కేసును ఎంతో ప్రొఫెషనల్గా ఆలోచించాలి అంటూ… ఎవరికో ఫోన్ చేసి అంజి గురించి వివరాలను తెలుపుతుంది.

Advertisement

ఇక తన స్నేహితులు కొడుకును కలవడానికి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళినా ఆనందరావుకు అక్కడ 25వ తేదీ మోనిత, కార్తీక్ పెళ్లి చేసుకుంటారనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆనందరావు దీప ఇంటికి చేరుకొని మోనితని చేసుకొని ఆమె ఇంటికి వెళ్తావా… లేక ఆమెని ఇంటికి తీసుకు వస్తావా.. బ్లడీ ఫూల్ అంటూ కార్తీక్ ను తిడతాడు. ఈ ఘోరం చూడటానికేనా నా కోడలను బతికించావు అంటూ నిలదీస్తాడు.తన తండ్రి తిడుతుంటే కార్తీక్ మనసులోనే మోనిత ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలని అనుకుంటాడు. ఈ విధంగా ఆనందరావు తిడుతుంటే కార్తీక్ ఏం చేయాలో తోచక తలదించుకుని నిలబడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.

Advertisement

Featured

Barelakka: నేను చనిపోతానేమో.. పెళ్లయిన కొద్ది రోజులకే బర్రె లెక్క సంచలన వ్యాఖ్యలు!

Published

on

Barelakka: బర్రెలక్క పరిచయం అవసరం లేని పేరు ఈమె సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను చేస్తూ ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా గత ఎన్నికలలో భాగంగా తెలంగాణ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరింత పాపులర్ అయ్యారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలలో కూడా పోటీకి దిగారు.

ఇలా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలైనటువంటి ఈమె వెంకటేష్ అనే వ్యక్తిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన భర్త సహాయంతో ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు అయితే ఇటీవల బర్రెలక్కపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో నెగటివ్ ట్రోల్స్ రావడం మొదలయ్యాయి.

ఈ విధంగా ఈమె గురించి నెగిటివ్ కామెంట్లు రావడంతో తన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడ్డారు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో నా గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ చూస్తుంటే నేను మరో గీతాంజలి అవుతానేమోనని భయం వేస్తుందని తెలిపారు. ఆ ట్రోల్స్ చూసిన కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారని తెలిపారు.

Advertisement

దయచేసి ట్రోల్ చేయొద్దు..
మీకు నాపై కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టండి కానీ దయచేసి ఎవరూ కూడా ఇలాంటి కామెంట్లు చేయొద్దని ఈమె తెలిపారు. ఆ కామెంట్లు చూసి నేను కూడా ఎక్కడ చనిపోతానేమోనని బాధ భయం నాలో కలుగుతున్నాయని తెలిపారు. ఇక నేను ఎంపీ ఎన్నికలలో పోటీ చేయడమే తప్పు అయితే ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నేను పూర్తిగా సోషల్ మీడియాకి అలాగే రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ట్రోల్స్ కారణంగా ఈమె ఇబ్బంది పడుతున్నానంటూ ఎమోషనల్ అవుతూ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

YS Vijayamma: ఎన్నికలవేళ కొడుకు పై తల్లి ప్రేమ చాటుకున్న విజయమ్మ.. జగన్ అంటే అంత ఇష్టమా?

Published

on

YS Vijayamma: ఏపీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా కూటమి నేతలు ఎన్నో అసత్యపు వార్తలను ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక చివరికి తన కన్నతల్లి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపలేదంటూ ప్రచారాలు చేశారు కానీ వైయస్ విజయమ్మకు తన కూతురు షర్మిల కంటే కొడుకు జగన్ అంటేనే ఇష్టమని తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలిచాయి.

ఇటీవల వైఎస్ షర్మిలని గెలిపించాలి అంటూ ఈమె ఒక వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియోలో భాగంగా జగన్ పై తనకున్నటువంటి ప్రేమను చాటుకున్నారు. వైయస్సార్ ముద్దుల బిడ్డ వైయస్ షర్మిలమ్మ కడప పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తున్నారు తనకు ఓటు వేసి గెలిపించాలని ఈమె అందరిని వేడుకున్నారు.

ఇక ఈ వీడియోలో భాగంగా వైయస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందని, ఎక్కడా కూడా ఈమె కాంగ్రెస్ పేరు పలకలేదు అలా పలకడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తోంది. అంతేకాకుండా షర్మిలను గెలిపించాలని చెప్పారే తప్ప వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎక్కడా కోరలేదు.

Advertisement

కాంగ్రెస్ పేరు కూడా పలకలేదు…
ఇక ఈ వీడియోలో భాగంగా విజయమ్మ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఎక్కడ పలకలేదు. దీన్ని బట్టి చూస్తేనే ఈమె తన కొడుకుకు మద్దతు తెలుపుతున్నారని, తన కొడుకు అంటేనే విజయమ్మకు ప్రేమ ఉందని తెలుస్తుంది అలాకాకుండా పూర్తిగా తన కూతురికే మద్దతు తెలిపేలాగా ఉంటే ఈమె తన కొడుకు పై విమర్శలు చేసేది కానీ ఎక్కడ కూడా జగన్ పేరును కూడా విజయమ్మ ప్రస్తావించకపోవడం తన కొడుకు పై తనకు ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనమని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Chiranjeevi: సరైన ప్రభుత్వాలు వస్తేనే అభివృద్ధి.. యువతకు పిలుపునిచ్చిన చిరంజీవి!

Published

on

Chiranjeevi: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రిటీలందరూ కూడా క్యూ లైన్లో నిలబడి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సినీ సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా నేడు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ఓటు వినియోగించుకున్నటువంటి చిరంజీవి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువతకు మంచి సందేశం అందజేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాయుద్ధం అయినటువంటి ఓటును యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో కూడా సరైన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తేనే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు.

Advertisement

ఓటు మన బాధ్యత..
ఇక చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీక్లబ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరితోపాటు ఎన్టీఆర్ అల్లు అర్జున్ శ్రీకాంత్ దంపతులు కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!