అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా
రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం “ఊహలు గుసగుసలాడే”.ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఈమెకు అవకాశాలు తక్కువైనప్పటికీ తమిళంలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా నాగచైతన్య సరసన “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ సందర్భంలో రాశీ ఖన్నా మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఏవిధంగా ఉండాలనే విషయాలను గురించి వెల్లడించారు. ఎప్పుడు ఓకే పంథాలో కొనసాగాలంటే ఇండస్ట్రీలో కుదరదు.. ఇండస్ట్రీలో అనుభవం పెరిగే కొద్దీ కొత్త కొత్త మార్గాలను అన్వేషించాలని ఈ బ్యూటీ చెబుతోంది. కెరియర్ మొదట్లో ప్రతి ఒక్క హీరోయిన్ గ్లామరస్ పాత్రల ద్వారా లేదా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అయితే ఎప్పుడు ఇలాగే ఇండస్ట్రీలో కొనసాగుతున్న అంటే కుదరదు.
ఇండస్ట్రీలో ఓ దశకు వచ్చాక కచ్చితంగా వేర్వేరు దారులలో ప్రయాణించాల్సి ఉంటుంది.ఈ విధంగా నటనా ప్రాధాన్యత గ్లామరస్ పాత్రలను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే ఇండస్ట్రీలో కొంత కాలం పాటు నిలవగలము ఎప్పుడైతే మనలో విభిన్నమైన ప్రత్యేకతలు ఉంటాయో అప్పుడే మనకు అవకాశాలు కూడా వస్తాయని ఎప్పుడు కమర్షియల్ చిత్రాలలోనే నటిస్తానంటే అస్సలు కుదరదంటూ ఈ సందర్భంగా
రాశీ ఖన్నా తెలిపారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…