Gopi Chand: మరోసారి మహేష్ కు విలన్ గా మారిన యాక్షన్ హీరో గోపీచంద్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Gopi Chand: టాలెంటెడ్, యాక్షన్ హీరో గోపీచంద్ కెరియర్ మొదట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా గోపీచంద్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోపీచంద్ తన కెరియర్ మొదట్లో వర్షం, నిజం, జయం వంటి సినిమాలలో విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనంతరం హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇలా హీరోగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోకి తిరిగి విలన్ పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇదివరకే మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ పాత్ర ద్వారా మహేష్ బాబుతో పోటీపడ్డారు. ఈ క్రమంలోనే గోపీచంద్ కు మరోసారి మహేష్ బాబుతో పోటీ పడే అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పాల్గొననున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాల్లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటం కోసం దర్శక ధీరుడు గోపీచంద్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.హీరోగా మంచి పేరు సంపాదించుకున్న గోపీచంద్ ఇలా నెగిటివ్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…