మా ఎన్నికలు ముగిసినా.. అందులో వేడి మాత్రం తగ్గలేదు. ఎన్నికలు జరిగే సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. నిన్న జరిగిన విలేకురుల సమావేశంలో ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
మా లో ప్రస్తుతం మంచి వాతావరణం లేదని.. మాతో వాళ్లు కలిసి పని చేసే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించాడు. తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. తమకు ఎన్నికల్లో అన్యాయం జరిగిందని.. పోస్టల్ బ్యాలెట్స్ లో అన్యాయం జరగిందంటూ ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
రాత్రికి రాత్రే ఈసీ మెంబర్ల ఫలితాలు మారపోయాయని.. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా.. నటుడు బెనర్జీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎన్నికలు జరిగే రోజున మోహన్ బాబు తనను అరగంట బూతులు తిట్టాడని.. దానికి తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తాను సనీ పరిశ్రమలో ఉంటున్నానని.. తనను మోహన్ బాబు అలా బూతులు తిట్టడం.. అది అందరిముందు అనడం.. అవమానించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
మా ఎన్నికలు పూర్తయి మూడు రోజులు అవుతున్నా మోహన్ బాబు మాట్లాడిన మాటలు తనకు ఇంకా బాధ కలిగిస్తున్నాయని.. ఆ రోజు మోహన్ బాబు తనను కొట్టడానికి కూడా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. విష్ణు, మనోజ్ ఆపడంతో ఆగాడని.. అలాంటి అసోసియేషన్ లో నాకు రక్షణ ఉంటుందా.. అలాంటి వాటిలో తాను ఎందుకు ఉండాలి అంటూ ఎమోషనల్ అయ్యారు బెనర్జీ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…