మా ఎన్నికలు ముగిసినా.. అందులో వేడి మాత్రం తగ్గలేదు. ఎన్నికలు జరిగే సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. నిన్న జరిగిన విలేకురుల సమావేశంలో ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
మా లో ప్రస్తుతం మంచి వాతావరణం లేదని.. మాతో వాళ్లు కలిసి పని చేసే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించాడు. తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. తమకు ఎన్నికల్లో అన్యాయం జరిగిందని.. పోస్టల్ బ్యాలెట్స్ లో అన్యాయం జరగిందంటూ ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
రాత్రికి రాత్రే ఈసీ మెంబర్ల ఫలితాలు మారపోయాయని.. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా.. నటుడు బెనర్జీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎన్నికలు జరిగే రోజున మోహన్ బాబు తనను అరగంట బూతులు తిట్టాడని.. దానికి తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తాను సనీ పరిశ్రమలో ఉంటున్నానని.. తనను మోహన్ బాబు అలా బూతులు తిట్టడం.. అది అందరిముందు అనడం.. అవమానించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
మా ఎన్నికలు పూర్తయి మూడు రోజులు అవుతున్నా మోహన్ బాబు మాట్లాడిన మాటలు తనకు ఇంకా బాధ కలిగిస్తున్నాయని.. ఆ రోజు మోహన్ బాబు తనను కొట్టడానికి కూడా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. విష్ణు, మనోజ్ ఆపడంతో ఆగాడని.. అలాంటి అసోసియేషన్ లో నాకు రక్షణ ఉంటుందా.. అలాంటి వాటిలో తాను ఎందుకు ఉండాలి అంటూ ఎమోషనల్ అయ్యారు బెనర్జీ.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…