Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు. అయితే ఇలా ఈయన రిలేషన్ లో ఉంటూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్లోకి వచ్చే పెద్ద ఎత్తున వివాదం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా తన వ్యక్తిగత కారణాలవల్ల నరేష్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలోనూ మీడియా వార్తల్లోనూ హాట్ టాపిక్ గా మారారు.ఇకపోతే ఈయన గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ రమ్య పెట్టే టార్చర్ తాను భరించలేక తనకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. అలాగే ఆమె ఆస్తి కోసమే తనను పెళ్లి చేసుకుందని రమ్య పూర్తిగా డబ్బు మనిషి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రమ్య డబ్బు కోసం తనపై ఓసారి హత్య ప్రయత్నం కూడా చేసిందని నరేష్ చేస్తున్నటువంటి కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఈయన మరోసారి గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో భాగంగా తన ఇంటి పై దాడి జరగడానికి గల కారణం రమ్య రఘుపతి అంటూ ఆమె పేరును కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విధంగా దాడి ఘటనలో భాగంగా నరేష్ కేరవాన్ తో పాటు ఇతర వాహనాల అద్దాలు మొత్తం పగిలిపోయాయని ఈయన తెలియజేశారు. ఈ క్రమంలోనే పోలీసులు నరేష్ ఇంటిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇలా రమ్య రఘుపతి తన ఇంటిపై దాడి చేయించింది అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలపై రమ్య రఘుపతి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…
మన ఇంట్లో చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పే కొన్ని అలవాట్లు ఉంటాయి. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు…
ఉదయం నిద్రలేవగానే చాలా మంది చేసే మొదటి పని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం. ఆరోగ్యంపై అవగాహన పెరిగిన…
సాధారణంగా భక్తులు దేవాలయాలకు వెళ్లినప్పుడు తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలని, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు…