Actor Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు.
జగన్ మీద ఆర్జీవి సినిమా దేనికి పనికి రాదు…
ఇక ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ పృథ్వీ ఈ సారి జగన్ ను ప్రజలు నమ్మరు అంటూ చెప్పాడు. పవన్ చంద్రబాబు కి వ్యతిరేకంగా జగన్ మీద సానుభూతి వచ్చేలా ఆర్జీవితో జగన్ సినిమా తీయిస్తున్నారు అనే అంశం మీద మాట్లాడుతూ జనాలు అలా ఉద్దేశ పూర్వకంగా సినిమాలను తీస్తే చూసి వాటి వల్ల ప్రభావితం అవుతారని అనుకోను అంటూ అభిప్రాయపడ్డారు.
ఈ మధ్య జనాలు కూడా సినిమాలను చూసే తీరు మారిపోయింది. ఆర్జీవి తీసే సినిమా వల్ల డైరెక్టర్ కి, నిర్మాతకి మాత్రమే లాభం. ఆ సినిమాతోనే కుప్పంలో చంద్రబాబును ఓడించేస్తాం అనడం హాస్యాస్పదం అంటూ చెప్పారు. ఇక సినిమాను వాళ్ళు చేసిన మంచి పనుల గురించి తీస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఆలా మేము ఈ పనులు చేసాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం అని చెప్పమనండి అలా తీస్తే అందులో నేనే ఒక క్యారెక్టర్ చేస్తాను డబ్బులిస్తే అంటూ చెప్పారు. 2024 లో 2019 ఎన్నికల లాగా సీట్లు గెలుస్తారు కానీ ఈసారి జగన్ కి కాదు పవన్ కి వస్తాయి అంటూ తెలిపారు. ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు జగన్ పై వ్యతిరేకత ఉంది అంటూ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…