Swetha Lakshmipathi : యాంకర్ గా అలాగే స్క్రిప్ట్ రైటర్ గా కమెడియన్ గా 70 కి పైగా సినిమాల్లో నటించిన లక్ష్మీపతి గారు చేసింది కొన్ని సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు ఆయనని మర్చిపోలేరు. ఆంధ్రుడు, అల్లరి, కితకితలు, పెద్ద బాబు వంటి సినిమాల్లో అయన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ఇక ఆయన విలన్ గా చేసిన ఏకైక సినిమా ఆయన తమ్ముడు శోభన్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు సినిమా బాబీ. ఇక చూడాలని ఉంది సినిమాతో కమెడియన్ గా తెలుగులో బ్రేక్ తెచ్చుకున్న లక్ష్మీపతి గారు 2008లో మరణించారు. అయన మరణం కంటే నెల రోజుల ముందు ఆయన తమ్ముడు డైరెక్టర్ శోభన్ గుండెపోటుతో మరణించారు. ఇక నెల వ్యవధిలో కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడం ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేక పోవడంతో చాలా ఇబ్బందులు పడినట్లు లక్ష్మీపతి గారి కూతురు శ్వేత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియపారు. తన తండ్రి బాబాయ్ తో ఉన్న అనుబంధాన్ని పుస్తకాల రూపంలో తెచ్చారు శ్వేత.
నాన్న చనిపోడానికి కారణం…
రేడియో జాకీ గా వైజాగ్ లో పనిచేస్తున్న సమయంలో 2008 జనవరి 7 న బాబాయ్ శోభన్ మరణించారు. ఆయన మరణించిన నెల రోజులకు సరిగ్గా అదే రోజున తండ్రి లక్ష్మీపతి మరణించారు. శ్వేత గారు ఆ సమయంలో జాబ్ చేస్తున్నా ఖర్చులు పోను తన వద్ద 1500 మాత్రమే చేతిలో ఉన్నాయంటూ అసలు ఏం చేయాలో తెలియలేదంటూ తెలిపారు. తన తండ్రి మరణించే రోజు కూడా ఫోన్ చేసారంటూ చెప్పారు. శ్వేత గారి అమ్మ, తమ్ముడు ఇద్దరూ శ్వేత గారిని చూడటానికి వైజాగ్ వెళ్లగా ఆరోజు తిరిగి హైదరాబాద్ వెళ్లారట. ఇంకా వాళ్ళు ఇంటికి రాలేదని లక్ష్మీపతి గారు కూతురికి ఫోన్ చేసి అడిగితే వస్తారు కాస్త ఎక్కడైనా ఆలస్యమై ఉంటుంది అంటూ చెప్పి మామూలుగా మాట్లాడారట. తీరా మధ్యాహ్నం సమయంలో ఆయన అనారోగ్యంగా ఉంది హాస్పిటల్ తెసుకెళ్ళమని ఫోన్ చేయగా తరచూ లక్ష్మీపతిగారు అనారోగ్యం పాలవుతూ ఉండటం వల్ల శ్వేత సీరియస్ గా తీసుకోలేదట.
అయితే మరో బాబాయ్ ఫోన్ చేసి త్వరగా రా అని చెప్పేసరికి ఏదో జరిగిందని అర్థమై ఫ్లైట్ పట్టుకుని వెళ్లగా ఒక్కసారిగా నాన్న మరణించాడని తెలిసి షాక్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాక తాగడం బాగా అలవాటైపోయింది దాంతో అయన ఆరోగ్యం పాడైంది. ఇక బాబాయ్ మరణంను అసలు తట్టుకోలేని నాన్న ఆ బాధతోనే మరణించారు అంటూ శ్వేత ఎమోషనల్ అయ్యారు. ఆయన అంత్యక్రియలకు మా వద్ద డబ్బులు లేక అందరూ ఆలోచిస్తుంటే ఇండస్ట్రీలో వాళ్ళు బాగా సహాయం చేసారు అయితే అప్పటి పరిస్థితుల్లో పెద్దగా తెలియదు కానీ మహేష్ బాబు, ప్రభాస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ వంటి వారు సహాయం చేసారు అంటూ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…