Actor Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. అయితే ఈ సినిమాల కంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీ కి కే.ఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ సూట్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. అలా యాంకర్ గా ఉన్న సమయంలోనే రాఘవేంద్ర రావు పరదేశి సినిమా ఆడిషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుండగా పాల్గొని అందులో లయతో పాటు రెండో ప్లేస్ తెచ్చుకున్నాడు. అలా ఇండస్ట్రీ కంట పడిన శివాజీ ఆపైన మాస్టర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి రాజకీయాలలో చురుగ్గా ఉంటున్నారు.
పోసాని ఎవరో నాకు తెలియదు…
రాజకీయాల్లో కులం కార్డు ఉపయోగించే వాళ్లంటే నాకు నచ్చదు అంటూ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన శివాజీ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నపుడు కులం కార్డు లేదని, ఎపుడైతే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారో ఆయన అభివృద్ధి చూసాక కులం కార్డు, అలాగే తెలంగాణ వాదం బయటికి తీశారు అంటూ శివాజీ ఆయన అభిప్రాయాలను తెలిపారు.
ఇక పోసాని గారు ఇటీవల కమ్మ నందులు అంటూ మాట్లాడటం గురించి ఇంటర్వ్యూలో ప్రశ్న రాగా పోసాని లాంటి పెద్ధ మనిషి గురించి నేను మాట్లాడను అంటూనే కమ్మ నందులైతే రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలోనే నాకు నంది అవార్డు వచ్చింది. అలాగే మహేష్ బాబుకి కూడా నంది అవార్డు వచ్చింది. మరి కమ్మనందులు ఎలా అయ్యాయి అపుడు అంటూ కులం కార్డు వాడి రాజకీయాలను వైసీపీ వ్యూహకర్త పీకే మరింత ఎక్కువ చేస్తారు. ఇప్పుడు అన్ని కులాల్లోను చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత కుల పిచ్చి ఇంకెక్కడా కనిపించదు అంటూ తెలిపారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…