Shivaji Raja : తెలుగులో క్యారెక్టర్ అరిస్ట్ గాను, విలన్ గాను కమెడియన్ గాను హీరోగాను సినిమాల్లో నటించిన నటుడు శివాజీ రాజా. ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఎదిగాడు. సినిమాలలో ఎంత ఫేమస్ అయ్యారో బుల్లితెర మీద సీరియల్స్ లోను ముఖ్యంగా ‘అమృతం’ వంటి సీరియల్ లో ఆయన అమృత రావు క్యారెక్టర్ లో పండించిన కామెడీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇక ఇటీవల హీరోలకు తండ్రిగా కూడా నటిస్తున్న శివాజీ రాజా సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తున్నారు. ఇక తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాజీ మా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గురించి మాట్లాడారు.
మా అసోసియేషన్ కు సొంత భవనం పేరుతో మొన్నటి మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు గెలిచారు. ఆయన మా అధ్యక్షుడు అయి ఏడాది గడిచినా ఇప్పటికీ పునాది కాదుకదా ఇటుక కూడా పడలేదు. ఇక ఇదే అంశం గురించి శివాజీ రాజా మాట్లాడుతూ మా బిల్డింగ్ కట్టాలనే చొరవ తీసుకునే వారు ఉంటే కట్టడం ఎక్కువకాలం పట్టదు. విరాళంగా డబ్బులను ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ చొరవ చూపి అడిగే వారే లేరు. అమెరికా లో ప్రోగ్రామ్ చేసి ఆ వచ్చిన డబ్బులు మా అసోసియేషన్ కోసం ఇవ్వాలని అనుకున్నపుడు ఎంతో బిజీగా ఉన్న చిరంజీవి గారు అమెరికా వచ్చారు.
ఇక మహేష్ ను అడిగితే మీరు చెప్పండి మేము చేస్తాం అన్నట్లు చెప్పారు. ఇక ప్రభాస్ అయితే ఏకంగా ఆ ప్రోగ్రామ్ అంతా చేస్తే మీకు ఎన్ని డబ్బులు సమకురతాయో చెప్పండి అంత కష్టపడటం ఎందుకు అదంతా నేనే ఇచ్చేస్తా అంటూ చెప్పారట. ఇలా అందరు అగ్ర హీరోలు తమవంతు సహాయం చేయడానికి ముందున్నారు. కానీ చొరవగా అడిగి చేసే వాళ్ళు లేరు అంటూ చెప్పారు శివాజీరాజా. ఇక మా అసోసియేషన్ లో ఒక వ్యక్తి గురించి పరోక్షంగా మాట్లాడుతూ అలాంటి బొకడా గాళ్ళను చాలా మందిని నా జీవితంలో చూసాను అంటూ మాట్లాడారు. నేను ఎవరి గురించి అంటున్నానో వారికి ఈ స్టేట్మెంట్ వింటేనే అర్థమవుతుంది నేను అన్నది వాళ్లనే అని పేరు చెప్పనక్కర్లేదు అంటూ మాట్లాడారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…