Kiraak RP: కిరాక్ ఆర్పీ పరిచయం అవసరం లేని పేరు.జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన అనంతరం జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమై బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.ఈ క్రమంలోనే హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ప్రారంభించారు. ఇక్కడ వివిధ రకాల చేపలు పులుసులను అందుబాటులోకి తీసుకురావడంతో పెద్ద ఎత్తున కస్టమర్లు ఆర్పీ రెస్టారెంట్ ముందు బార్లు తీరారు.
ఈ విధంగా కర్రీ పాయింట్ వద్ద భారీగా కస్టమర్లు గూమి కూడడంతో ట్రాఫిక్ జామ్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా రెస్టారెంట్ బిజినెస్ లో ఎంతో సక్సెస్ సాధించినటువంటి ఆర్పీ చేపల పులుసు గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.
అందరూ అనుకున్నట్టుగా ఆర్పీ చేపల పులుసు ఏమంత టేస్టీగా లేదని కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. అయితే తన రెస్టారెంట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆర్పీ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే తన రెస్టారెంట్ పై కుట్ర జరుగుతోందని ఈయన ఆరోపించారు.
నేను ఇదివరకు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని స్వయంగా నాకు కిచెన్లో ఎలా చేపల పులుసు వండుతున్నారో చూపించాను.ఒకరు మా రెస్టారెంట్లో చేపలు పులుసు టేస్ట్ చేసి మరో పదిమందిని తీసుకువస్తున్నారంటే అక్కడ ఎంత క్వాలిటీగా రుచికరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే నా రెస్టారెంట్ గురించి ఇలా ఉద్దేశపూర్వకంగా చెడుగా ప్రచారం చేసే వారందరూ కూడా పెయిడ్ బ్యాచ్ అని, నేను నీతిగా నిజాయితీగా బిజినెస్ చేస్తున్నా నన్ను ఎవరు మోసం చేయలేరు.మీరు నన్ను ఎంత నెగిటివ్ చేస్తే నాకు అంత ప్రమోషన్ ఉంటుందని ఈ సందర్భంగా తన రెస్టారెంట్ గురించి జరుగుతున్న కుట్ర గురించి ఆర్పీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…