K Viswanath: లెజెండరీ డైరెక్టర్, దర్శక దిగ్గజలు కే విశ్వనాథ్ గత గురువారం అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.92 సంవత్సరాలు వయసు కలిగినటువంటి విశ్వనాథ్ గారు వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఇక ఈయన అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన విశ్వనాథ్ గారు ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నారు. ఇలాంటి దిగ్గజ దర్శకులు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి అయితే విశ్వనాథ్ గారు మరణించడంతో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈయన మృతికి సంతాపం తెలియజేశారు.ఇక ఈయన అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశాన వాటికలో బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరిగాయి.
ఇలా స్మశాన వాటికలో విశ్వనాథ్ గారి అంత్యక్రియలు సాధారణంగా జరగడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు చనిపోతే గత కొంతకాలంగా ప్రభుత్వం అధికారక లాంఛనాలతో వారి అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ గారికి అధికారకలాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విశ్వనాధ్ గారికి ఎంతో మంచి అనుబంధం ఉంది.అదేవిధంగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేశారు ఆయనప్పటికీ ప్రభుత్వం అధికారక లాంచనాలతో అంత్యక్రియలు జరపకపోవడం పై ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయనకు అధికారకలాంచనాలతో అంత్యక్రియలు జరగకపోవడానికి గల కారణం ఉంది.
గత కొద్దిరోజుల క్రితం నిజాం మునిమనవడు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. నిజాం సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపటానికి చూసిన వారి వారసులకు ఏఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం అధికారక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి దీంతో గత కొంతకాలంగా అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపడం నిలిపివేశారని తెలుస్తోంది అందుకే విశ్వనాథ్ గారికి కూడా అధికారక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదని సమాచారం.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…