Shivaji raja : ‘కళ్ళు’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన శివాజీ రాజా ఆ తరువాత చాలా సినిమాల్లో చిన్న సైజు విలన్ గా నటించాడు. నెగెటివ్ పాత్రలే కాకుండా సహాయక పాత్రలతోను మెప్పించాడు. కమెడియన్ గాను అలరించిన శివాజీ రాజా హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ సినిమా మంచి గుర్తింపునిచ్చింది. ఆయనకు నంది అవార్డు, అలాగే ఫిలిం ఫేర్ అవార్డులు ఆయన సినిమాలలో నటనకు వచ్చాయి. ప్రస్తుతం మా సినిమా సంఘం లో కీలక పాత్ర పోషిస్తున్న శివాజీ సినిమాల్లో ఎక్కువగా కనిపించడంలేదు.
చిరు అభిమాని అవడం వల్ల కెరీర్ పోయింది…
దర్శకుడు వంశీ మొదటగా హీరోగా నన్ను చూసాడని ‘శ్రీ కనకమహాలక్ష్మి డాన్స్ ట్రూప్’ సినిమాలో మొదట హీరోగా నన్నే అనుకున్న చివర్లో మార్చి నరేష్ ను పెట్టుకున్నారని చెప్పారు. ఇక మొదట హీరోని చేసింది ఎంవి రఘు గారని తెలిపారు. ఇక సీనియర్ నటుడు రంగనాథ్ గారు మొదటి నుండి నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని భావించేవారిని అలానే మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమా తీశామని చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా 35 ఏళ్ల సినీ కెరీర్ లో అవకాశాలు రాలేదని, అభిమానం ఉంటే మనసులో పెట్టుకోవాలి కానీ బయటకు చెప్పకూడదని ఈ తరం వారికి సలహా ఇస్తానని చెప్పారు. చిరు అభిమాని అని చెప్పడం వల్ల వాళ్ళ మనిషి అనుకుంటారని, ఇక మిగతా వాళ్ళు పట్టించుకోరు ఇక మెగాస్టార్ వాళ్ళింట్లో మనోడే కదా అని పట్టించుకోరు, అలా ఎటూ కాకుండా పోయానని ఈ విషయం తెలుసుకోడానికి 35 ఏళ్ళు పట్టిందని చెప్పారు.
మెగాస్టార్ ఫ్యామిలీలో ఏ హీరో సినిమాలోనూ ఇంతవరకు చేయలేదని చెప్పారు. మెగాస్టార్ తో ఇంతవరకు నటించలేదని, ఇకపై ఒకవేళ ఆయనే పిలిచి అడిగినా నటించనని ఆ ఓపిక, కసి ఇప్పుడు లేవని తెలిపారు. కానీ చాలా సినిమాలు ఇతర హీరోలతో చేసానని గుర్తుచేసుకున్నారు. ఇక బుల్లి తెర మీద అమృతం, ఆలస్యం అమృతం విషం, పండు మిరపకాయ్, నాన్న కుచ్చి వంటి సీరియల్స్ తో అలరించారు శివాజీరాజా. ఇక ఈ మధ్య ‘అర్జున ఫాల్గుణ’ సినిమాలో కూడా నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…